ఈ గురువారం విడుదల కాబోతున్న అన్నీ మంచి శకునములే ఓపెనింగ్స్ తోనే అద్భుతాలు చేస్తుందని నిర్మాణ సంస్థ స్వప్న సినిమా అత్యాశలో లేదు. టాక్ బాగా వచ్చి క్రమంగా ఆడియన్స్ పెరిగి బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుందనే నమ్మకం యూనిట్ లో కనిపిస్తోంది. సంతోష్ శోభన్ వరస ఫ్లాపుల్లో ఉండటం వల్ల బజ్ పరంగా ఆశించిన స్థాయిలో అంచనాలు లేవు కానీ ఇలాంటి ఫ్యామిలీ మూవీస్ పికప్ అయ్యేది రెండు మూడు రోజుల నుంచే. ఇదిలా ఉండగా ఈ సినిమా స్టోరీ లైన్ అప్పుడెప్పుడో వచ్చిన సిద్దార్థ్ బావ నుంచి తీసుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది.
దానికి ఆధారంగా చెబుతున్న పాయింట్ ఒకటే. రెండు కుటుంబాలు విడిపోతే వాళ్ళను కలిపేందుకు వరసకు బావ మరదళ్లయిన హీరో హీరోయిన్లు పూనుకోవడం. బావ పూర్తిగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో జరిగితే అన్నీ మంచి శకునములేని హిల్ స్టేషన్ సెటప్ కి మార్చారు. కేవలం ఈ ఒక్క సారూప్యత ఆధారంగా రెండింటికి పోలిక ఆపాదించడం కామెడీనే అవుతుంది. ఎందుకంటే ఈ బ్యాక్ డ్రాప్ లో చాలా తెలుగు సినిమాలొచ్చాయి. వెంకటేష్ కలిసుందాం రా కన్నా మంచి ఉదాహరణ అక్కరలేదు. పెద్దరికం, నువ్వు లేక నేను లేను చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే అవుతుంది
పోలికలు ఉన్నా లేకపోయినా ఆడియన్స్ కోరుకున్న ఎంటర్ టైన్మెంట్ ఇస్తే చాలు ఆటోమేటిక్ గా హిట్టయ్యే ట్రెండ్ లో దర్శకురాలు నందిని రెడ్డి పూర్తిగా వినోదాన్ని ఎమోషన్లను నమ్ముకున్నారు. ఎలాగూ బాక్సాఫీస్ డల్ గా ఉంది. సరైన సినిమా లేక థియేటర్లకు వెళ్లాల్సిన కుటుంబాలు పార్కులు రెస్టారెంట్లు తిరుగుతూ టైం పాస్ చేస్తున్నారు. ఈ టైంలో చూడొచ్చనే మాట వచ్చినా చాలు అన్నీ మంచి శకునములేకు జరిగిన బిజినెస్ కి ఈజీగా టార్గెట్ దాటేస్తుంది. సీతారామన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన మూవీ కావడంతో వైజయంతీ టీమ్ దీని మీద గట్టి నమ్మకంతో ఉంది
This post was last modified on May 16, 2023 1:57 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…