Movie News

నైజామ్ వసూళ్లకు టికెట్ రేట్ల దెబ్బ

కొద్దిరోజుల క్రితం దర్శకుడు తేజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ థియేటర్ సినిమాను పాప్ కార్న్ రేట్లు చంపేస్తున్నాయని అన్నారు. నిజమే. కానీ అసలైన టికెట్ ధరల విషయంలో అమలవుతున్న అసంబద్ధ విధానం గురించి కూడా నాలుగు ముక్కలు చెప్పి ఉంటే బాగుండేదని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో ఈ మధ్య ఏదైనా కొత్త సినిమా వస్తే చాలు మల్టీప్లెక్సులు జిఓ ప్రకారం తమకు అనుమతించిన 295 రూపాయల గరిష్ట ధరను గుడ్డిగా పెట్టేస్తున్నారు. దీని వల్ల ముందుగా టికెట్లు రిజర్వ్ చేసుకోవాలనుకున్న వాళ్లకు అదనంగా మరో 30 రూపాయలు చమురు వదులుతోంది.

ఈ కారణంగానే కస్టడీకి ఆశించిన స్థాయిలో ఫస్ట్ డే బుకింగ్స్ కనిపించలేదు. సింగల్ స్క్రీన్లలో కౌంటర్ అమ్మకాలు ఎక్కువ జరుగుతాయి కానీ మల్టీప్లెక్సులకు వచ్చే వాళ్ళు అధిక శాతం ఆధారపడేది ఆన్ లైన్ యాప్స్ మీదే. అలాంటప్పుడు పబ్లిక్ టాక్ రివ్యూలు చూసి వెళ్దామని వెయిట్ చేస్తున్నారు. ఏజెంట్, శాకుంతలం ఫలితాలను పక్కనపెడితే ఈ రేట్లే ఫస్ట్ డే మార్నింగ్ షో అయ్యాక మిగిలిన ఆటల కలెక్షన్ ని దెబ్బ కొట్టాయి. ఇది ఏడాదిగా రిపీట్ అవుతూనే ఉంది. గతంలో విక్రమ్, మేజర్ లాంటి వాటికి 200 రూపాయలు నిర్ణయించడం అవి బ్లాక్ బస్టరయ్యాక చాలా ఉపయోగపడింది

ట్రాజెడీ ఏంటంటే ఫలితం తెలిసిపోయాక కూడా రెండో వారంలోనూ అదే 295 కంటిన్యూ చేయడం డిజాస్టర్లకు శరాఘాతంగా మారుతోంది. ఇక్కడ ఎగ్జిబిటర్ కన్నా ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్ నిర్మాత నష్టపోతారు. దాని బదులు ముందే సరైన నిర్ణయం తీసుకుంటే ఈ ఇబ్బంది ఉండదు. ఏపీలో ఈ సమస్య లేకపోవడం అక్కడి మూవీ లవర్స్ కి పెద్ద ఊరట. ప్రత్యేకమైన పరిస్థితులు బడ్జెట్ లు ఉన్న వాటికి ముందే అనుమతి తీసుకుంటే తప్ప రేట్లు పెంచుకోలేరు. సంక్రాంతి తర్వాత ఎవరూ అప్లై చేసుకోలేదు. ఇకనైనా నైజామ్ లో ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం అవసరం

This post was last modified on May 12, 2023 3:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

2 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

3 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

3 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

5 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

5 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

6 hours ago