Movie News

శాకుంతలం.. సౌండ్ లేకుండా

బ్లాక్ బస్టర్ అయిన సినిమాలే కాదు.. డిజాస్టర్ అయిన సినిమాలు కూడా రిలీజ్ టైంలో సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అవుతుంటాయి. ట్రోలింగ్ ద్వారా వాటిని బాగా వార్తల్లో నిలబెడుతుంటారు నెటిజన్లు. థియేటర్లలో వాషౌట్ అయిపోయిన అలాంట ిచిత్రాలు ఓటీటీల్లోకి వచ్చేటపుడు కొంచెం హంగామా కనిపిస్తుంది.

థియేటర్లలో డిజాస్టర్ రిజల్ట్ వస్తే వచ్చిందని.. డిజిటల్ రిలీజ్ టైంలో ఓటీటీలు కూడా వాటిని ప్రమోట్ చేసి జనాల దృష్టిని ఆకర్షించాలని చూస్తాయి. కానీ ‘శాకుంతలం’ సినిమా విషయంలో ఇలా ఏమీ జరగలేదు. ఈ సినిమా రిలీజైనపుడు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. అందులో గ్రాఫిక్స్ సహా అనేక విషయాలపై నెటిజన్లు టీంను ఒక ఆటాడుకున్నారు. ఇప్పుడా సినిమా చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

సరిగ్గా రిలీజైన నాలుగు వారాలకు ‘శాకుంతలం’ను అమేజాన్ ప్రైమ్ వాళ్లు రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచే ఈ సినిమా స్ట్రీమ్ అవుతో్ంది. మామూలుగా ప్రైమ్ వాళ్లు కొత్త సినిమాలు రిలీజవుతున్నపుడు కొంచెం హడావుడి చేస్తారు. థియేట్రికల్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ.. ఓటీటీ రిలీజ్ గురించి అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తారు.

కానీ ‘శాకుంతలం’ విషయంలో అలా చేయలేదు. నెటిజన్లకు కొంచెం లేటుగా ఈ విషయం తెలుస్తోంది. ఐతే ఈ చిత్రం ఓటీటీలో వస్తే చూడాలని చాలామందే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడిక సినిమా చూసి ఇంకో రౌండ్ ట్రోలింగ్ మొదలుపెట్టడం ఖాయం. బిగ్ స్క్రీన్ మీద త్రీడీలో చూసినపుడే ఈ సినిమా జనాలకు ఎక్కలేదు. ఇక చిన్న తెర మీద 2డీలో చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందో చెప్పాల్సిన పని లేదు. సమంత ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago