అక్కినేని నాగార్జున గతంలో బహు భాషా దర్శకులతో పని చేశాడు. తమిళం నుంచి కూడా పలువురు దర్శకులు ఆయనతో సినిమాలు తీశారు. ఇదే కోవలో వెంకట్ ప్రభు సైతం నాగ్తో ఓ సినిమా చేయాలనుకున్నారట. ప్రస్తుతం నాగ్ కొడుకు నాగచైతన్యతో ఆయన ‘కస్టడీ’ తీసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ దర్శకుడితో నాగ్ సినిమా చేయాల్సిందట. కానీ అనివార్య కారణాలతో అది క్యాన్సిల్ అయిందట.
దాని గురించి వెంకట్ ప్రభు మీడియాకు వివరిస్తూ.. “నేను తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాను. కానీ కుదరడం లేదు. అజిత్ గారితో తీసిన ‘మన్కాతా’ సినిమాను తెలుగులో సమాంతరంగా నాగార్జున గారితో చేయడానికి సంప్రదింపులు జరిగాయి. కానీ కొన్ని కారణాలతో అది కుదరలేదు. తర్వాత ‘మానాడు’ సినిమాను కూడా ఒకేసారి తెలుగులో వేరే హీరోగా చేయాాలనుకున్నా. కానీ అదీ సాధ్యపడలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ‘కస్టడీ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నా” అని వెంకట్ తెలిపాడు.
‘కస్టడీ’ సినిమా కథకు స్ఫూర్తి ఒక మలయాళ చిత్రం అని చెబుతూ.. చైతూనే ఎందుకు ఇందులో లీడ్ రోల్ కోసం తీసుకున్నది వెంకట్ వెల్లడించాడు. “మలయాళంలో నాయట్టు సినిమా నాకు బాగా నచ్చింది. అందులో ప్లాట్ పాయింట్ చూసి స్ఫూర్తి పొందాను. ఆ పాయింట్తో ఒక కమర్షియల్ కోణంలో సినిమా ఎందుకు తీయకూడదు అని ‘కస్టడీ’ కథ రాశాను. ‘లవ్ స్టోరీ’ సినిమాలో ఒక పాట చూస్తుంటే నా పాత్రకు చైతూనే సరిపోతాడు అనిపించి అతడికి కథ వినిపించాను. తనకు నచ్చి ఈ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాకు శివ అనే టైటిల్ పెడదామనుకున్నా. కానీ చైతూ వద్దన్నాడు” అని తెలిపాడు.
This post was last modified on May 11, 2023 2:01 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…