స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ ని సెట్ చేసుకోవడం ఎంత కష్టమో సరైన విలన్ ని దొరకబుచ్చుకోవడం అంతకంటే పెద్ద సవాల్ గా మారుతోంది. అప్పుడెప్పుడో ఆశిష్ విద్యార్ధి, ముఖేష్ ఋషి, షియాజీ షిండేల రూపంలో మంచి బాలీవుడ్ బ్యాచ్ ఉండేది కానీ క్రమంగా అది తగ్గిపోయింది. ఒకపక్క రావు రమేష్, ప్రకాష్ రాజ్ లు రొటీన్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి చాలా తెలివైన సెలక్షన్ చేసుకున్నారు. బాలకృష్ణతో చేస్తున్న ఎన్బికె 108 కోసం అర్జున్ రామ్ పాల్ ని తీసుకొచ్చాడు. ఈ మేరకు చిన్న వీడియోతో అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు
నిజానికి అర్జున్ రామ్ పాల్ ని మొన్న ఏడాది హరిహర వీరమల్లు కోసం ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్రాజెక్టులో విపరీతమైన ఆలస్యం జరగడంతో పాటు డేట్ల సమస్య వల్ల తప్పుకున్నాడు. ఆ స్థానంలోనే బాబీ డియోల్ వచ్చి చేరాడు ఇప్పుడు బాలయ్యతో ఢీ కొట్టబోతున్నాడు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా చూసే అలవాటున్న వాళ్లకు ఇతను పరిచయమే. 2001లో ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ తో తెరంగేట్రం చేసి చెప్పుకోదగ్గ హిట్లైతే సాధించాడు. తర్వాత పోటీగా వచ్చిన జాన్ అబ్రహంలాగా దూకుడు చూపించలేక సినిమాలు వేగంగా చేయడం తగ్గించాడు
మొత్తానికి అనిల్ రావిపూడి డిఫరెంట్ క్యాస్టింగ్ ని సెట్ చేసుకుంటున్నాడు. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్, కూతురి పాత్రగా ప్రచారంలో ఉన్న శ్రీలీల ఇదంతా చూస్తే ఏదో డిఫరెంట్ స్టోరీని చూపించబోతున్న అభిప్రాయమైతే కలిగుతోంది. పటాస్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి మాస్ టచ్ ఇందులోనే ఉంటుందని యూనిట్ టాక్. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత తమన్ మూడోసారి బాలయ్య కోసం ట్యూన్లు కడుతున్నాడు. విజయదశమికి విడుదల కాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు పోటీగా రామ్ బోయపాటి, లియో, టైగర్ నాగేశ్వరరావులు రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…