1996 నాటికీ విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన పేరొచ్చింది. అన్నయ్య నిర్మాత సురేష్ బాబుకి ఎక్కడో యూత్ ని మిస్సవుతున్న ఫీలింగ్ కలిగింది. ఇంత తక్కువ వయసులో శోభన్ బాబు టైపు పాత్రలు వరసగా చేస్తే మాస్ కి యువతకు దూరమయ్యే ప్రమాదం ఉందని గుర్తించి సరైన కథ కోసం చూస్తుండగా దీనరాజ్ ఇచ్చిన స్టోరీ బ్రహ్మాండంగా నచ్చింది. తమ సంస్థలో పని చేస్తూ అప్పటికే ఒక ఛాన్స్ చేజారి దర్శకత్వ అవకాశం కోసం ఎదురు చూస్తున్న జయంత్ సి పరాంజీకి ఆ బాధ్యతను అప్పగించారు. రచయితలు పరుచూరి బ్రదర్స్ రంగంలోకి దిగారు.
హైదరాబాద్ కుర్రాడు రాయలసీమ అమ్మాయి ప్రేమించుకోవడం ఇందులో మెయిన్ పాయింట్. దాని చుట్టూ తగినంత కామెడీ, హీరోయిన్ తండ్రి సెంట్రల్ పాయింట్ గా కరుడుగట్టిన ఫ్యాక్షన్ విలనిజం ని హైలైట్ చేస్తూ ఎంటర్ టైన్మెంట్ మిస్ కాకుండా చూసుకున్నారు. విలన్ పాత్రధారి కోసం బుర్రలు బద్దలు కొట్టుకున్నారు ఒకదశలో బాలీవుడ్ నుంచి నానా పటేకర్ లాంటోళ్ళను తీసుకొద్దామనుకున్నారు. కానీ సురేష్ బాబుకి నచ్చలేదు. ఆఖరికి అవకాశం జయప్రకాష్ రెడ్డిని వరించింది. స్వతహాగా నంద్యాలకు చెందిన ఈయన ఇందులో డైలాగులను సీమ యాసలో చెప్పడం కోసం స్వయంగా ఆ ప్రాంతాలకు వెళ్లొచ్చారు
హీరోయిన్ సెలక్షన్ కోసం నెలల తరబడి ఆడిషన్లు చేస్తే ఫైనల్ గా అంజలా ఝవేరి ఓకే అయ్యింది. సంగీత దర్శకుడు మహేష్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డెప్త్ కోసం మణిశర్మకు బీజీఎమ్ ఛాన్స్ ఇచ్చారు. కీలకమైన శివుడు క్యారెక్టర్ కు రియల్ స్టార్ శ్రీహరి ప్రాణం పోశారు. ఇలా అన్నీ జతకూడిన ప్రేమించుకుందాం రా 1997 మే 9 న రిలీజై సురేష్ బాబు కోరుకున్నట్టు కాలేజీ విద్యార్థులను ఊపేసింది. మాస్ కి సైతం విపరీతంగా ఎక్కేసింది. యాభై కేంద్రాల్లో వంద రోజులు ఆడటం ఆ టైంలో రికార్డు. తర్వాత ఈ రా పరంపరలో చాలా సినిమాలు వచ్చాయి
This post was last modified on May 10, 2023 7:39 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…