Movie News

సీతారామం-2కు ద‌ర్శకేంద్రుడి స్టోరీ లైన్

ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో వ‌చ్చిన ఉత్త‌మ ప్రేమ‌క‌థ‌ల్లో సీతారామం ఒక‌టి. దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట‌గా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఒక క్లాసిక్ ల‌వ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఎంతో మంది ప్రేక్ష‌కులు ఆ సినిమా చూసి క‌దిలిపోయారు.

ఫిలిం సెల‌బ్రెటీలు కూడా అందుకు మిన‌హాయింపేమీ కాదు. రాఘ‌వేంద్ర‌రావు లాంటి లెజెండ‌రీ డైరెక్ట‌ర్ కూడా అందులో ఒక‌ర‌ని ఇప్పుడే తెలిసింది. సీతారామం త‌న‌కు ఎంతో న‌చ్చిన‌.. త‌న‌ను ఎమోష‌న‌ల్‌గా క‌దిలించిన సినిమా అని ఆయ‌న వైజ‌యంతీ వారి కొత్త చిత్రం అన్నీ మంచి శ‌కున‌ములేకు సంబంధించిన ఒక ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో వెల్ల‌డించారు. సీతారామం త‌ర్వాత వ‌స్తున్న ఈ చిత్రానికి అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌ని.. పెద్ద హిట్ట‌వుతుంద‌ని చెబుతూ.. సీతారామం చిత్రానికి సీక్వెల్ తీయాల‌ని ఆయ‌న నిర్మాత స్వ‌ప్న‌ను కోరారు.

సీతారామం సినిమాలో సీత ప‌రిస్థితి త‌లుచుకుంటే గుండె త‌రుక్కుపోతుందని.. ఆమెను అలా వ‌దిలేయ‌కుండా ఈ క‌థ‌ను పొడిగించి సీక్వెల్ తీయాల‌ని రాఘ‌వేంద్రరావు సూచించారు. అందుకోసం స్టోరీ లైన్ కూడా ఆయ‌నే చెప్ప‌డం విశేషం. రామ్ చ‌నిపోయాడ‌న్న బాధ‌తో తుపాకీ తీసుకుని సీత విల‌న్ ద‌గ్గ‌రికి వెళ్తుంద‌ని.. అప్పుడు అత‌ను నీ రామ్ చ‌నిపోలేదంటూ ఒక గుహ‌లోకి తీసుకెళ్లి చూపిస్తాడని.. అక్క‌డి నుంచి రామ్‌ను విడిపించుకుని వ‌చ్చాక‌.. సీత కుటుంబ స‌భ్యులు వారిని వెంటాడుతార‌ని.. ఇలా ప్లాట్ పాయింట్ తీసుకుని సెకండ్ పార్ట్ తీయాల‌ని రాఘ‌వేంద్ర‌రావు కోరారు.

సీత గురించి ఇప్పుడు త‌లుచుకున్నా త‌న క‌ళ్లో నీళ్లు తిరుగుతాయ‌ని.. ఆమె క‌థ‌ను కొనసాగించాల‌ని.. త‌న‌కు న్యాయం చేయాల‌ని రాఘ‌వేంద్ర‌రావు చెప్ప‌గా.. స్వ‌ప్న‌, అల్లు అర‌వింద్ స‌హా అక్క‌డున్న‌ అంద‌రూ న‌వ్వేశారు.

This post was last modified on May 9, 2023 6:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

19 seconds ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

2 minutes ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

11 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

12 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

13 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

13 hours ago