ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన ఉత్తమ ప్రేమకథల్లో సీతారామం ఒకటి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఎంతో మంది ప్రేక్షకులు ఆ సినిమా చూసి కదిలిపోయారు.
ఫిలిం సెలబ్రెటీలు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. రాఘవేంద్రరావు లాంటి లెజెండరీ డైరెక్టర్ కూడా అందులో ఒకరని ఇప్పుడే తెలిసింది. సీతారామం తనకు ఎంతో నచ్చిన.. తనను ఎమోషనల్గా కదిలించిన సినిమా అని ఆయన వైజయంతీ వారి కొత్త చిత్రం అన్నీ మంచి శకునములేకు సంబంధించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్లో వెల్లడించారు. సీతారామం తర్వాత వస్తున్న ఈ చిత్రానికి అదృష్టం కలిసి వస్తుందని.. పెద్ద హిట్టవుతుందని చెబుతూ.. సీతారామం చిత్రానికి సీక్వెల్ తీయాలని ఆయన నిర్మాత స్వప్నను కోరారు.
సీతారామం సినిమాలో సీత పరిస్థితి తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందని.. ఆమెను అలా వదిలేయకుండా ఈ కథను పొడిగించి సీక్వెల్ తీయాలని రాఘవేంద్రరావు సూచించారు. అందుకోసం స్టోరీ లైన్ కూడా ఆయనే చెప్పడం విశేషం. రామ్ చనిపోయాడన్న బాధతో తుపాకీ తీసుకుని సీత విలన్ దగ్గరికి వెళ్తుందని.. అప్పుడు అతను నీ రామ్ చనిపోలేదంటూ ఒక గుహలోకి తీసుకెళ్లి చూపిస్తాడని.. అక్కడి నుంచి రామ్ను విడిపించుకుని వచ్చాక.. సీత కుటుంబ సభ్యులు వారిని వెంటాడుతారని.. ఇలా ప్లాట్ పాయింట్ తీసుకుని సెకండ్ పార్ట్ తీయాలని రాఘవేంద్రరావు కోరారు.
సీత గురించి ఇప్పుడు తలుచుకున్నా తన కళ్లో నీళ్లు తిరుగుతాయని.. ఆమె కథను కొనసాగించాలని.. తనకు న్యాయం చేయాలని రాఘవేంద్రరావు చెప్పగా.. స్వప్న, అల్లు అరవింద్ సహా అక్కడున్న అందరూ నవ్వేశారు.
ఇంగ్లాండ్ టీ20 టూర్లో టీమిండియా ఆడుతున్న తీరు చూస్తుంటే ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అవుతోంది. ట్రెంట్ బ్రిడ్జ్ లో…
తమిళనాడు సీఎం విజయ్ జన నాయకుడు సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు తెరమీద డ్రామా కన్నా గొప్పగా పండుతున్నాయి. మొన్నెవరో…
కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్సు ఎక్కాలి.. తెలంగాణ వెళ్ళడానికి హైదరాబాద్ బస్సు ఎక్కాలి.. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి…
వెండితెరపై ఎప్పుడూ కాస్త బోల్డ్, వెస్ట్రన్ లుక్స్తో ట్రెండ్ క్రియేట్ చేసే శ్రుతి హాసన్ ఈసారి పూర్తిగా రూట్ మార్చేసింది.…
దురంధర్ తర్వాత రామ్ చరణ్ మెచ్చుకున్న బాలీవుడ్ మూవీ ఇటీవలే విడుదలైన బేబి దో డై దో. టైటిల్ విచిత్రంగా…
ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు, ఆ తర్వాత అతడి అరెస్టులపై పెద్ద రచ్చే కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై…