ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన ఉత్తమ ప్రేమకథల్లో సీతారామం ఒకటి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఎంతో మంది ప్రేక్షకులు ఆ సినిమా చూసి కదిలిపోయారు.
ఫిలిం సెలబ్రెటీలు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. రాఘవేంద్రరావు లాంటి లెజెండరీ డైరెక్టర్ కూడా అందులో ఒకరని ఇప్పుడే తెలిసింది. సీతారామం తనకు ఎంతో నచ్చిన.. తనను ఎమోషనల్గా కదిలించిన సినిమా అని ఆయన వైజయంతీ వారి కొత్త చిత్రం అన్నీ మంచి శకునములేకు సంబంధించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్లో వెల్లడించారు. సీతారామం తర్వాత వస్తున్న ఈ చిత్రానికి అదృష్టం కలిసి వస్తుందని.. పెద్ద హిట్టవుతుందని చెబుతూ.. సీతారామం చిత్రానికి సీక్వెల్ తీయాలని ఆయన నిర్మాత స్వప్నను కోరారు.
సీతారామం సినిమాలో సీత పరిస్థితి తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందని.. ఆమెను అలా వదిలేయకుండా ఈ కథను పొడిగించి సీక్వెల్ తీయాలని రాఘవేంద్రరావు సూచించారు. అందుకోసం స్టోరీ లైన్ కూడా ఆయనే చెప్పడం విశేషం. రామ్ చనిపోయాడన్న బాధతో తుపాకీ తీసుకుని సీత విలన్ దగ్గరికి వెళ్తుందని.. అప్పుడు అతను నీ రామ్ చనిపోలేదంటూ ఒక గుహలోకి తీసుకెళ్లి చూపిస్తాడని.. అక్కడి నుంచి రామ్ను విడిపించుకుని వచ్చాక.. సీత కుటుంబ సభ్యులు వారిని వెంటాడుతారని.. ఇలా ప్లాట్ పాయింట్ తీసుకుని సెకండ్ పార్ట్ తీయాలని రాఘవేంద్రరావు కోరారు.
సీత గురించి ఇప్పుడు తలుచుకున్నా తన కళ్లో నీళ్లు తిరుగుతాయని.. ఆమె కథను కొనసాగించాలని.. తనకు న్యాయం చేయాలని రాఘవేంద్రరావు చెప్పగా.. స్వప్న, అల్లు అరవింద్ సహా అక్కడున్న అందరూ నవ్వేశారు.
This post was last modified on May 9, 2023 6:27 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…