ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన ఉత్తమ ప్రేమకథల్లో సీతారామం ఒకటి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఎంతో మంది ప్రేక్షకులు ఆ సినిమా చూసి కదిలిపోయారు.
ఫిలిం సెలబ్రెటీలు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. రాఘవేంద్రరావు లాంటి లెజెండరీ డైరెక్టర్ కూడా అందులో ఒకరని ఇప్పుడే తెలిసింది. సీతారామం తనకు ఎంతో నచ్చిన.. తనను ఎమోషనల్గా కదిలించిన సినిమా అని ఆయన వైజయంతీ వారి కొత్త చిత్రం అన్నీ మంచి శకునములేకు సంబంధించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్లో వెల్లడించారు. సీతారామం తర్వాత వస్తున్న ఈ చిత్రానికి అదృష్టం కలిసి వస్తుందని.. పెద్ద హిట్టవుతుందని చెబుతూ.. సీతారామం చిత్రానికి సీక్వెల్ తీయాలని ఆయన నిర్మాత స్వప్నను కోరారు.
సీతారామం సినిమాలో సీత పరిస్థితి తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందని.. ఆమెను అలా వదిలేయకుండా ఈ కథను పొడిగించి సీక్వెల్ తీయాలని రాఘవేంద్రరావు సూచించారు. అందుకోసం స్టోరీ లైన్ కూడా ఆయనే చెప్పడం విశేషం. రామ్ చనిపోయాడన్న బాధతో తుపాకీ తీసుకుని సీత విలన్ దగ్గరికి వెళ్తుందని.. అప్పుడు అతను నీ రామ్ చనిపోలేదంటూ ఒక గుహలోకి తీసుకెళ్లి చూపిస్తాడని.. అక్కడి నుంచి రామ్ను విడిపించుకుని వచ్చాక.. సీత కుటుంబ సభ్యులు వారిని వెంటాడుతారని.. ఇలా ప్లాట్ పాయింట్ తీసుకుని సెకండ్ పార్ట్ తీయాలని రాఘవేంద్రరావు కోరారు.
సీత గురించి ఇప్పుడు తలుచుకున్నా తన కళ్లో నీళ్లు తిరుగుతాయని.. ఆమె కథను కొనసాగించాలని.. తనకు న్యాయం చేయాలని రాఘవేంద్రరావు చెప్పగా.. స్వప్న, అల్లు అరవింద్ సహా అక్కడున్న అందరూ నవ్వేశారు.
This post was last modified on May 9, 2023 6:27 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…