The Kerala Story
రేపు విడుదల కానున్న ది కేరళ స్టోరీ మీద పెద్ద వివాదాలే చుట్టుముట్టాయి. ఇంకో ఇరవై నాలుగు గంటల్లో షోలు పడబోతున్న నేపథ్యంలో థియేటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చనే అంచనాలు బలంగా ఉన్నాయి. తమిళనాడు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి తమ నిఘా రిపోర్ట్ ని ఇవ్వడంతో స్క్రీనింగ్ కి సంబంధించిన నిర్ణయం ఈ రోజు తీసుకోబోతున్నారు. కేరళ డిస్ట్రిబ్యూటర్ల సంఘం బయ్యర్లను ఒత్తిడి చేయకుండా ఇష్టం ఉంటే వేసుకోవచ్చని భద్రతకు ఎవరి బాధ్యత ఉండదని ముందస్తుగానే తేల్చి చెప్పింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏపీ తెలంగాణలో రేపే రానుంది.
ఇంత కాంట్రావర్సీ నెలకొన్న పరిస్థితిలో సినిమాని వీలైనంత త్వరగా చూసేందుకు మూవీ లవర్స్ రెడీ అవుతున్నారు. కంటెంట్ ఏ స్థాయిలో ఉందో ట్రైలర్ లో ఆల్రెడీ శాంపిల్ చూపించారు. ఒకవేళ సినిమా మొత్తం ఇలా ఉంటే నిరసనలు, అడ్డుకోవడాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పటికే ఈ ఇష్యూ మీద రాజకీయ పార్టీలు రెండుగా విడిపోయాయి. కొందరు ప్రజాస్వామ్యంలో ఇలా వ్యతిరేకత చూపడం సరికాదని అంటుంటే మరికొందరు క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో మతాల మధ్య మనోభావాలు రెచ్చగొట్టవద్దని హితవు పలుకుతున్నారు. ఇలా హాట్ డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి
నితిన్ హార్ట్ అటాక్, సాయిధరమ్ తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాల్లో మెరిసిన అదా శర్మ ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. పాకిస్థాన్ తీవ్రవాద సంస్థ ఐసిఎస్ లో చేరేందుకు శత్రువులు పన్నిన కుట్రలో ఇరుక్కుని మతం మారి పెళ్లి చేసుకుంటుంది. తీరా అక్కడికి వెళ్ళాక పడిన నరకం ఎలా ఉంటుందనే పాయింట్ మీద దర్శకులు సుదిప్తో సేన్ ది కేరళ స్టోరీని రూపొందించారు. మొత్తం ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథగా ప్రెజెంట్ చేశారు. మరి షోలు పడక ముందే ఆగిపోతుందా లేక ఎలాంటి అడ్డంకులు లేకుండా వస్తుందా వెయిట్ అండ్ సీ
This post was last modified on May 4, 2023 11:34 am
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…