ఇవాళ అనారోగ్యంతో కన్నుమూసిన మనోబాల మృతి పట్ల తమిళ పరిశ్రమ తీవ్ర విషాదంలో ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఒక నటుడిగానే ఈయన పరిచయం. మొన్న సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్యలో కొద్దినిమిషాల పాటు జడ్జ్ పాత్రలో కనిపించి మెప్పించారు. టాలీవుడ్ కు సంబంధించి అదే ఆయన ఆఖరి చిత్రం. అయితే చాలా మందికి అవగాహన లేనంత మాత్రాన మనోబాలని తక్కువగా చూడలేం. కొన్ని విషయాలు తెలుసుకుంటే గొప్పదనం అర్థమవుతుంది. తన అసలు పేరు బాలచందర్. అప్పటికే ఆ పేరుతో ఓ డైరెక్టర్ ఉండటంతో మార్చుకోవాల్సి వచ్చింది.
మనోబాల పరిశ్రమకు వచ్చింది దర్శకుడు కావాలనే లక్ష్యంతో. 1975 ప్రాంతంలో కమల్ హాసన్ రిఫరెన్స్ తో భారతి రాజా వద్ద అసిస్టెంట్ గా ప్రయాణం మొదలుపెట్టారు. ఎక్కువ సమయం పట్టకుండానే 1982లో ఆగయ గంగైతో దర్శకుడిగా మారారు. అయితే అది సక్సెస్ కాలేదు. నటుడిగా అవకాశాలు రావడంతో రమణారెడ్డిలా కనిపించే రూపం మంచి కమెడియన్ వేషాలను తీసుకొచ్చింది. అయితే డైరెక్టర్ సంకల్పాన్ని పక్కన పెట్టలేదు. మూడేళ్ళ తర్వాత తిరిగి మెగా ఫోన్ పట్టుకుని చేసిన నాన్ ఉంగళ్ రసిగన్, పిల్లై నిలా హిట్ అయ్యాయి మళ్ళీ ఛాన్సులు తీసుకొచ్చాయి.
అక్కడి నుంచి ఒకపక్క వేషాలు వేస్తూనే దర్శకుడిగా 24 సినిమాలు తీశారు. రజనీకాంత్, విజయ్ కాంత్, ప్రభు, సత్యరాజ్ లాంటి అగ్ర హీరోలను డైరెక్ట్ చేసి ఎన్నో హిట్లు అందుకున్నారు. నిర్మాతగా సతురంగ వెట్టై ఘన విజయం సాధ్హించింది. దీన్నే తెలుగులో సత్యదేవ్ తో బ్లఫ్ మాస్టర్ గా శివలెంక కృష్ణప్రసాద్ రీమేక్ చేశారు. ప్రొడ్యూసర్ గా మనోబాల మూడు సినిమాలు తీయగా పలు సీరియల్స్ లో కీలక భూమిక పోషించారు. తెలుగులో గగనం, రాజ్ దూత్, దేవదాస్, మహానటి లాంటి వాటిలో తళుక్కున మెరిశారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిజంగానే ఆయన సాధించిన శిఖరాలు పెద్దవే.
This post was last modified on May 4, 2023 12:05 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…