టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీలకు ఆఫర్ల వర్షం ఆగడం లేదు. పట్టుమని అయిదు సినిమాలు రిలీజ్ కాకుండానే డిమాండ్ ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకో రెండు మూడేళ్ళ దాకా కాల్ షీట్స్ లేవనేంత బిజీగా మారిపోయింది. ఇవాళ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే భారీ చిత్రంలో తనే కథానాయికగా లాక్ అయ్యింది. పూజా కార్యక్రమాలతో షూటింగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. సోషల్ ఇష్యూ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోయే ఈ పోలీస్ డ్రామా నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందుతోందని టాక్.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో పెద్ద లైనప్ ఉంది. మహేష్ బాబు 28, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ బోయపాటి కాంబో, నితిన్ వక్కంతం వంశీల ప్రాజెక్ట్, వైష్ణవ్ తేజ్ కొత్త మూవీ, బాలకృష్ణ అనిల్ రావిపూడిల ఎన్బికె 108 ఇలా లిస్టు చాంతాడంత ఉంది. ఇవన్నీ రిలీజయ్యేలోగా 2024 దాదాపు గడిచిపోతుంది. అయితే కాల్ షీట్స్ పరంగా ఇబ్బంది రాకుండా ఇవన్నీ ఈ ఏడాదే పూర్తి చేసుకునేలా శ్రీలీల డేట్స్ ఇచ్చినట్టుగా సమాచారం. మరో అయిదారు సినిమాలు తన అంగీకారం కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ఇవి కాకుండా తమిళ కన్నడ ఆఫర్లు వేరుగా ఉన్నాయి.
వరస పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండ ఖుషితో పాటు దీని మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా బాడీ లాంగ్వేజ్ ని పూర్తిగా మార్చుకుని ఇందులో కనిపించబోతున్నట్టు వినికిడి. అమితాబ్ బచ్చన్ జంజీర్, రాజశేఖర్ అంకుశం రేంజ్ లో పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధమయ్యిందని తెలిసింది. రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమా చేయి జారాక గౌతమ్ తిన్ననూరికి సైతం సాలిడ్ బ్లాక్ బస్టర్ పడాలి. హిందీ జెర్సీ రీమేక్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. సో ఇప్పుడు కంబ్యాక్ అవ్వాల్సింది దీంతోనే. అనిరుద్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది
This post was last modified on May 3, 2023 5:00 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…