దుర్గారావు.. టిక్ టాక్ ఫాలో అవుతూ వచ్చిన తెలుగు జనాలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరిది. గోదారవి జిల్లాకు చెందిన ఈ వ్యక్తి టిక్ టాక్లో సూపర్ పాపులర్. టిక్ టాక్కే తన జీవితాన్ని అంకితం చేసినట్లుగా ఆయన ఆయన అందులో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. దుర్గారావు మాత్రమే కాదు.. ఆయన భార్య, మిగతా కుటుంబ సభ్యులు అందరూ కలిసి దాదాపు ప్రతి రోజూ టిక్ టాక్ వీడియోలు చేసేవాళ్లు.
వాళ్ల ఉపాధి ఏంటో.. కుటుంబం ఎలా గడుస్తుందో కానీ.. రోజూ కొన్ని గంటల పాటు సమయాన్ని వెచ్చించి వీడియోలు చేసేవాళ్లు. అవి కామెడీగా అనిపిస్తూనే జనాలకు వినోదం పంచేవి. ఈ కుటుంబాన్ని ముందు కామెడీ చేసిన వాళ్లందరూ కూడా వాళ్ల వీడియోలను చూడకుండా ఉండలేని పరిస్థితి. ఎవరేమన్నా పట్టించుకోకుండా అమాయకంగా వీడియోలు చేస్తూ వెళ్లిన దుర్గారావు కుటుంబం తిరుగులేని పాపులారిటీ సంపాదించింది.
ఐతే ఈ మధ్య టిక్ టాక్ నిషేధంతో ఇలాంటి వాళ్లందరికీ పెద్ద షాక్ తగిలింది. అయితేనేం దుర్గారావు అండ్ ఫ్యామిలీ రొపోసో లాంటి వేరే యాప్ల్లోకి అడుగు పెట్టి మళ్లీ వీడియోలు చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. సోషల్ మీడియాలో దుర్గారావు అని కొడితే పదుల లెక్కలేనన్ని టిక్ టాక్ వీడియోలు.. ఆయన గురించి చర్చలు కనిపిస్తాయి. కామెడీగానో మరోలానో దుర్గారావుకు క్రేజ్ అయితే తక్కువగా లేదు. ఈ మధ్య ‘ఢీ’ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఓ పాటలో డ్యాన్సర్లతో పాటు హైపర్ ఆది తదితరులు దుర్గారావు, ఆయన భార్యను అనుకరిస్తూ స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఇక తాజాగా దుర్గారావు, ఆయన భార్య నేరుగా తెరంగేట్రం చేసే రోజూ వచ్చేసింది. వీళ్లిద్దరూ త్వరలోనే ‘జబర్దస్త్’ ప్రోగ్రాంలో కనిపించనున్నారు. హైపర్ ఆది స్కిట్లోనే వీళ్లు కనిపించనున్నారు. వీరి మీద స్కిట్ చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ సందర్భంగా హైపర్ ఆది, రోజాలతో కలిసి దుర్గారావు, ఆయన భార్య దిగిన ఫొటోలు కనిపిస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…