దుర్గారావు.. టిక్ టాక్ ఫాలో అవుతూ వచ్చిన తెలుగు జనాలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరిది. గోదారవి జిల్లాకు చెందిన ఈ వ్యక్తి టిక్ టాక్లో సూపర్ పాపులర్. టిక్ టాక్కే తన జీవితాన్ని అంకితం చేసినట్లుగా ఆయన ఆయన అందులో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. దుర్గారావు మాత్రమే కాదు.. ఆయన భార్య, మిగతా కుటుంబ సభ్యులు అందరూ కలిసి దాదాపు ప్రతి రోజూ టిక్ టాక్ వీడియోలు చేసేవాళ్లు.
వాళ్ల ఉపాధి ఏంటో.. కుటుంబం ఎలా గడుస్తుందో కానీ.. రోజూ కొన్ని గంటల పాటు సమయాన్ని వెచ్చించి వీడియోలు చేసేవాళ్లు. అవి కామెడీగా అనిపిస్తూనే జనాలకు వినోదం పంచేవి. ఈ కుటుంబాన్ని ముందు కామెడీ చేసిన వాళ్లందరూ కూడా వాళ్ల వీడియోలను చూడకుండా ఉండలేని పరిస్థితి. ఎవరేమన్నా పట్టించుకోకుండా అమాయకంగా వీడియోలు చేస్తూ వెళ్లిన దుర్గారావు కుటుంబం తిరుగులేని పాపులారిటీ సంపాదించింది.
ఐతే ఈ మధ్య టిక్ టాక్ నిషేధంతో ఇలాంటి వాళ్లందరికీ పెద్ద షాక్ తగిలింది. అయితేనేం దుర్గారావు అండ్ ఫ్యామిలీ రొపోసో లాంటి వేరే యాప్ల్లోకి అడుగు పెట్టి మళ్లీ వీడియోలు చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. సోషల్ మీడియాలో దుర్గారావు అని కొడితే పదుల లెక్కలేనన్ని టిక్ టాక్ వీడియోలు.. ఆయన గురించి చర్చలు కనిపిస్తాయి. కామెడీగానో మరోలానో దుర్గారావుకు క్రేజ్ అయితే తక్కువగా లేదు. ఈ మధ్య ‘ఢీ’ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఓ పాటలో డ్యాన్సర్లతో పాటు హైపర్ ఆది తదితరులు దుర్గారావు, ఆయన భార్యను అనుకరిస్తూ స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఇక తాజాగా దుర్గారావు, ఆయన భార్య నేరుగా తెరంగేట్రం చేసే రోజూ వచ్చేసింది. వీళ్లిద్దరూ త్వరలోనే ‘జబర్దస్త్’ ప్రోగ్రాంలో కనిపించనున్నారు. హైపర్ ఆది స్కిట్లోనే వీళ్లు కనిపించనున్నారు. వీరి మీద స్కిట్ చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ సందర్భంగా హైపర్ ఆది, రోజాలతో కలిసి దుర్గారావు, ఆయన భార్య దిగిన ఫొటోలు కనిపిస్తున్నాయి.
This post was last modified on August 5, 2020 5:24 pm
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…