రామ్ చరణ్ తో రంగస్థలం తీసిన మైత్రి మూవీ మేకర్స్ అప్పుడే మరో సినిమా చేయడానికి అడ్వాన్స్ ఇచ్చారు. ఈసారి చేసే సినిమా రంగస్థలంలా ప్రత్యేకంగానే ఉండాలని అప్పుడే ఒక మాట అనుకున్నారు. ఆర్.ఆర్.ఆర్. తర్వాత యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాలు చేయాలని చరణ్ చూస్తున్నాడు. ఇందుకోసం మైత్రి వాళ్ళు ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి అడ్వాన్స్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
ఖైదీ తర్వాత లోకేష్ తమిళంలో విజయ్ తో మాస్టర్ చేసాడు. ఈ సినిమా విడుదలైతే లోకేష్ పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోతాడని కోలీవుడ్ నమ్మకం. మాస్టర్ రిలీజ్ కాకముందే మైత్రి మూవీస్ అతడికి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసేసింది.
ఆర్.ఆర్.ఆర్. తర్వాత ఇది చేయాలంటూ చరణ్ కచ్చితంగా ఫిక్స్ అవలేదు కనుక లోకేష్ కనుక అతడికి నచ్చే కథ తీసుకెళ్తే ప్రాజెక్ట్ సెట్ అయిపోతుంది. అయితే వంశి పైడిపల్లి కూడా చరణ్ కి కథ వినిపించాడని వార్తలొచ్చాయి కానీ ఆ సినిమా ఖాయం చేస్తూ ఇంతవరకు అధికారికంగా ఎవరి నుంచి న్యూస్ రాలేదు. కనుక మాస్టర్ డైరెక్టర్ టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీకి ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి.
This post was last modified on August 5, 2020 12:54 am
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…