The Kerala Story
ఎంత కాంట్రావర్సీకి అంత పబ్లిసిటీ అన్నట్టు ఉంటుంది కొన్ని సినిమాల వ్యవహారం. కేరళలో తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ది కేరళ స్టోరీ ఈ వారమే విడుదల కాబోతోంది. గత ఏడాది ది కాశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు ఏవైతే పరిస్థితులు తలెత్తాయో అచ్చం అవే రిపీటవుతున్నాయి. ట్రైలర్ వచ్చాక రాజకీయంగా సైతం దీని మీద సమర్ధన, వ్యతిరేకత మొదలైంది. ముగ్గురు ఇతర మతస్థులైన మహిళలు ముస్లింలను పెళ్లి చేసుకుని వాళ్ళ ద్వారా ప్రభావితం చెంది పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చేరారనే పాయింట్ మీద ఈ నేపధ్యాన్ని అల్లుకున్నారు.
సెన్సార్ బోర్డు దీనికి చాలా కట్స్ మ్యూట్స్ ఇచ్చింది. శత్రుదేశంని ఉద్దేశించి పెట్టిన డైలాగులు, మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న సన్నివేశాలు అన్నింటికి కోత పెట్టింది. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇది పెద్ద తలనెప్పిగా మారడంతో ఏకంగా బ్యాన్ చేయాలని పిలుపు నివ్వడం మరో మలుపుకు దారి తీసింది. డిస్ట్రిబ్యూటర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. క్రిస్టియన్ వర్గం అధికంగా ఉండే ఆ రాష్ట్రంలో తర్వాత గణనీయమైన జనాభా ముస్లింలదే. అందుకే ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బ తింటుందోనన్న ఉద్దేశంతో రిలీజ్ నే ఆపాలని చూస్తోంది
అనధికార లెక్కల ప్రకారం కేరళలో ముప్పై ఐదు వేలకు పైగానే అమ్మాయిలు మహిళలు ఇలా మతమార్పిడిలో టెర్రరిజం వైపు ఆకర్షితులయ్యారని ఒక రిపోర్ట్ ఉంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం ఈ సినిమాకు నిషేధించాలంటూ నినదిస్తోంది. ఇంకో నాలుగు రోజుల్లో రిలీజ్ ఉన్న నేపథ్యంలో చివరి నిమిషం దాకా షోలు పడతాయనే గ్యారెంటీ లేదని బయ్యర్లు అనుమానపడుతున్నారు. అందుకే పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. సుదిప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ రియల్ డ్రామాని తక్కువ బడ్జెట్ లో పూర్తి చేశారు
This post was last modified on May 2, 2023 7:08 am
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…