మణిరత్నం లాంటి దర్శకుడు ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ సమస్య గురించి మాట్లాడితే వెంటనే అందరూ స్పందిస్తారు. హీరోలంతా ఆయన వెనక నిలబడతారు. గొప్ప ఫిలిం మేకర్ గా ఆయన తన గౌరవం అలా నిలబెట్టుకున్నారు. ఒకప్పుడు మణిరత్నంతో సమానంగా మాట్లాడుకున్న వర్మ చేజేతులా తన గౌరవం పోగొట్టుకున్నాడు. బుర్ర, బుద్ధి లేని అడోలసేంట్ కుర్రాళ్లను ఆకట్టుకోడానికి వర్మ నా ఇష్టం వచ్చినట్టుంటా అనే మాటలు మొదలు పెట్టాడు.
తర్వాత ఇష్టానికి సినిమాలు తీస్తూ, వ్యక్తులపై బురద జల్లుతూ తన ప్రతిష్ట మంటగలుపుకున్నాడు. బాలీవుడ్ మొత్తం తలెత్తి చూసిన చోట ఇప్పుడు వర్మకు చోటు లేదు. సుశాంత్ సింగ్ చావుని అందరూ తలా ఒక రకంగా వాడేసుకుంటూ వుంటే… అదే అడ్డం పెట్టుకుని బాలీవుడ్ జనాల దృష్టిని ఆకర్షించడానికి వర్మ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు అర్నాబ్ గోస్వామిపై సినిమా తీస్తానంటూ హల్చల్ చేస్తున్నాడు.
అటెన్షన్ కోసం టాలీవుడ్ లో వర్మ ఏమి చేస్తున్నాడనేది తెలిసిందే. కానీ ఇక్కడ తనను ఎవరూ దేఖట్లేదు. ఈ విధంగా బాలీవుడ్ తరఫున వకాల్తా తీసుకుని అర్నాబ్ పై అటాక్ చేస్తే అయినా అక్కడి వాళ్ళు పట్టించుకుంటారని ఆశ కాబోలు.
This post was last modified on August 9, 2020 7:44 am
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…