మణిరత్నం లాంటి దర్శకుడు ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ సమస్య గురించి మాట్లాడితే వెంటనే అందరూ స్పందిస్తారు. హీరోలంతా ఆయన వెనక నిలబడతారు. గొప్ప ఫిలిం మేకర్ గా ఆయన తన గౌరవం అలా నిలబెట్టుకున్నారు. ఒకప్పుడు మణిరత్నంతో సమానంగా మాట్లాడుకున్న వర్మ చేజేతులా తన గౌరవం పోగొట్టుకున్నాడు. బుర్ర, బుద్ధి లేని అడోలసేంట్ కుర్రాళ్లను ఆకట్టుకోడానికి వర్మ నా ఇష్టం వచ్చినట్టుంటా అనే మాటలు మొదలు పెట్టాడు.
తర్వాత ఇష్టానికి సినిమాలు తీస్తూ, వ్యక్తులపై బురద జల్లుతూ తన ప్రతిష్ట మంటగలుపుకున్నాడు. బాలీవుడ్ మొత్తం తలెత్తి చూసిన చోట ఇప్పుడు వర్మకు చోటు లేదు. సుశాంత్ సింగ్ చావుని అందరూ తలా ఒక రకంగా వాడేసుకుంటూ వుంటే… అదే అడ్డం పెట్టుకుని బాలీవుడ్ జనాల దృష్టిని ఆకర్షించడానికి వర్మ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు అర్నాబ్ గోస్వామిపై సినిమా తీస్తానంటూ హల్చల్ చేస్తున్నాడు.
అటెన్షన్ కోసం టాలీవుడ్ లో వర్మ ఏమి చేస్తున్నాడనేది తెలిసిందే. కానీ ఇక్కడ తనను ఎవరూ దేఖట్లేదు. ఈ విధంగా బాలీవుడ్ తరఫున వకాల్తా తీసుకుని అర్నాబ్ పై అటాక్ చేస్తే అయినా అక్కడి వాళ్ళు పట్టించుకుంటారని ఆశ కాబోలు.
This post was last modified on August 9, 2020 7:44 am
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…