అనుష్కను తెరమీద చూసి చాలా కాలమవుతోంది. భాగమతి తర్వాత మళ్ళీ నిశ్శబ్దం ద్వారా ఓటిటిలో చూసుకోవాల్సి వచ్చింది తప్ప ఇంకే హీరో పక్కన దర్శనం కలిగే భాగ్యం అభిమానులకు దక్కలేదు. అందుకే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మీద ఫ్యాన్స్ లో మంచి అంచనాలున్నాయి. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న నవీన్ పోలిశెట్టి ఇందులో హీరోగా నటించడం ప్రధాన ఆకర్షణ కానుండగా భారీ బడ్జెట్ లకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన యువి క్రియేషన్స్ ఈ కూల్ ఎంటర్ టైనర్ నిర్మించడం మరో విశేషం.
ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన టైంలో అనుష్క నవీన్ ల జంట ఎలా కనిపిస్తుందోననే అనుమానం లేకపోలేదు. అయితే దర్శకుడు మహేష్ బాబు వాటికి చెక్ పెడుతూ చక్కగా ప్రెజెంట్ చేశారు. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకునే ఒక లేడీ చెఫ్, నవ్విస్తూ జీవితం గడపాలనుకుంటూ స్టాండ్ అప్ కమెడియన్ గా అంతంతమాత్రం ఆదాయంతో నెట్టుకుంటూ వచ్చే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి మధ్య ఏర్పడే పరిచయం ఆ తర్వాత జరిగే పరిణామాల ఆధారంగా కథ నడుస్తుంది. అయితే ఇది ప్రేమ పెళ్లిగా మారుతుందా లేక ఇంకేదైనా ట్విస్టు ఉందానేది తెరమీద చూస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.
అనుష్క బొద్దుగా ఉంది. మరీ సన్నబడిన దాఖలాలైతే లేవు కానీ ముద్దుగుమ్మ ఎలా ఉన్నా అందమే తరహాలో స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చేలానే ఉంది. ఇక నవీన్ పోలిశెట్టి మరోసారి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. ఇంతకు ముందు మే మూడో వారంలో విడుదల ప్లాన్ చేసుకున్నారు కానీ ఇప్పుడీ టీజర్ లో మాత్రం కమింగ్ సూన్ అని ఇచ్చారు. అంటే మార్పు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. రధన్ సంగీతం సమకూర్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి నీరవ్ షా ఛాయాగ్రహణం అందించారు. ఇంత గ్యాప్ తర్వాత వస్తున్న అనుష్క ఇకనైనా వరసగా సినిమాలు చేస్తుందేమో చూడాలి.
This post was last modified on April 30, 2023 2:17 pm
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…