అనుష్కను తెరమీద చూసి చాలా కాలమవుతోంది. భాగమతి తర్వాత మళ్ళీ నిశ్శబ్దం ద్వారా ఓటిటిలో చూసుకోవాల్సి వచ్చింది తప్ప ఇంకే హీరో పక్కన దర్శనం కలిగే భాగ్యం అభిమానులకు దక్కలేదు. అందుకే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మీద ఫ్యాన్స్ లో మంచి అంచనాలున్నాయి. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న నవీన్ పోలిశెట్టి ఇందులో హీరోగా నటించడం ప్రధాన ఆకర్షణ కానుండగా భారీ బడ్జెట్ లకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన యువి క్రియేషన్స్ ఈ కూల్ ఎంటర్ టైనర్ నిర్మించడం మరో విశేషం.
ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన టైంలో అనుష్క నవీన్ ల జంట ఎలా కనిపిస్తుందోననే అనుమానం లేకపోలేదు. అయితే దర్శకుడు మహేష్ బాబు వాటికి చెక్ పెడుతూ చక్కగా ప్రెజెంట్ చేశారు. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకునే ఒక లేడీ చెఫ్, నవ్విస్తూ జీవితం గడపాలనుకుంటూ స్టాండ్ అప్ కమెడియన్ గా అంతంతమాత్రం ఆదాయంతో నెట్టుకుంటూ వచ్చే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి మధ్య ఏర్పడే పరిచయం ఆ తర్వాత జరిగే పరిణామాల ఆధారంగా కథ నడుస్తుంది. అయితే ఇది ప్రేమ పెళ్లిగా మారుతుందా లేక ఇంకేదైనా ట్విస్టు ఉందానేది తెరమీద చూస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.
అనుష్క బొద్దుగా ఉంది. మరీ సన్నబడిన దాఖలాలైతే లేవు కానీ ముద్దుగుమ్మ ఎలా ఉన్నా అందమే తరహాలో స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చేలానే ఉంది. ఇక నవీన్ పోలిశెట్టి మరోసారి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. ఇంతకు ముందు మే మూడో వారంలో విడుదల ప్లాన్ చేసుకున్నారు కానీ ఇప్పుడీ టీజర్ లో మాత్రం కమింగ్ సూన్ అని ఇచ్చారు. అంటే మార్పు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. రధన్ సంగీతం సమకూర్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి నీరవ్ షా ఛాయాగ్రహణం అందించారు. ఇంత గ్యాప్ తర్వాత వస్తున్న అనుష్క ఇకనైనా వరసగా సినిమాలు చేస్తుందేమో చూడాలి.
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…