గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై తమిళంలో ఆ అంచనాల మేర విజయాన్ని అందుకుంది మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్. కానీ తెలుగులో మాత్రం ఆ చిత్రం నిరాశ పరిచింది. మన ప్రేక్షకులకు ఆ సినిమా అంతగా రుచించలేదు. కథాకథనాలు.. యాక్షన్ ఘట్టాలు బాహుబలి తరహలో ఊహించుకున్న మన ప్రేక్షకులు నిరాశ చెందారు. అలా అని అది తీసిపడేయదగ్గ సినిమా కాదు. అందులో కొన్ని ఆకర్షణలున్నాయి. ముఖ్యంగా ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులందరూ ఆకట్టుకున్నారు.
శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్-2కు కూడా ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ హైలైట్గా నిలిచింది. ఐతే అందరిలోకి ఎక్కువ ఆకట్టుకుంది… ప్రేక్షకులను కట్టి పడేసింది మాత్రం కార్తీ-త్రిషల జోడీనే అని చెప్పాలి.
పొన్నియన్ సెల్వన్-2లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ విక్రమ్ ఉన్నాడు. ఒకప్పటి ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ఉంది. ఇంకా ఎంతోమంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. కానీ వాళ్లందరినీ మించి ప్రేక్షకులను ఎక్కువ మెప్పిస్తోంది కార్తీ, త్రిషలే. కార్తీ మామూలుగానే తెరపై కనిపిస్తే హుషారు వస్తుంది. ఈ సినిమాలో అతను మరింతగా ఆకట్టుకున్నాడు. తన చలాకీ నటనతో ప్రతి సన్నివేశంలోనూ మెప్పించాడు.
ఇక వయసు పెరిగే కొద్దీ త్రిషలో అందం, ఆకర్షణ పెరిగిపోతుండటం విశేషం. ఆమె కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ చూపు తిప్పుకోవడం కష్టం. కెరీర్ ఆరంభంలో కూడా ఇంత అందంగా లేదు అనిపించేలా ఈ సినిమాలో ముగ్ధ మనోహరంగా కనిపించిందామె. ఇక కార్తీ-త్రిషల కలయికలో ఒక నీటి మడుగు మధ్యలో వచ్చే ఒక సీన్ వారెవా అనిపిస్తుందంతే. సినిమాలో స్టాండౌట్గా నిలిచిన సన్నివేశం అది. సినిమాలోని మహా మహా నటీనటులను డామినేట్ చేస్తూ కార్తీ-త్రిష హైలైట్ అవ్వడం పెద్ద విషయమే.
This post was last modified on April 29, 2023 6:27 am
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…