గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై తమిళంలో ఆ అంచనాల మేర విజయాన్ని అందుకుంది మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్. కానీ తెలుగులో మాత్రం ఆ చిత్రం నిరాశ పరిచింది. మన ప్రేక్షకులకు ఆ సినిమా అంతగా రుచించలేదు. కథాకథనాలు.. యాక్షన్ ఘట్టాలు బాహుబలి తరహలో ఊహించుకున్న మన ప్రేక్షకులు నిరాశ చెందారు. అలా అని అది తీసిపడేయదగ్గ సినిమా కాదు. అందులో కొన్ని ఆకర్షణలున్నాయి. ముఖ్యంగా ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులందరూ ఆకట్టుకున్నారు.
శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్-2కు కూడా ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ హైలైట్గా నిలిచింది. ఐతే అందరిలోకి ఎక్కువ ఆకట్టుకుంది… ప్రేక్షకులను కట్టి పడేసింది మాత్రం కార్తీ-త్రిషల జోడీనే అని చెప్పాలి.
పొన్నియన్ సెల్వన్-2లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ విక్రమ్ ఉన్నాడు. ఒకప్పటి ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ఉంది. ఇంకా ఎంతోమంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. కానీ వాళ్లందరినీ మించి ప్రేక్షకులను ఎక్కువ మెప్పిస్తోంది కార్తీ, త్రిషలే. కార్తీ మామూలుగానే తెరపై కనిపిస్తే హుషారు వస్తుంది. ఈ సినిమాలో అతను మరింతగా ఆకట్టుకున్నాడు. తన చలాకీ నటనతో ప్రతి సన్నివేశంలోనూ మెప్పించాడు.
ఇక వయసు పెరిగే కొద్దీ త్రిషలో అందం, ఆకర్షణ పెరిగిపోతుండటం విశేషం. ఆమె కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ చూపు తిప్పుకోవడం కష్టం. కెరీర్ ఆరంభంలో కూడా ఇంత అందంగా లేదు అనిపించేలా ఈ సినిమాలో ముగ్ధ మనోహరంగా కనిపించిందామె. ఇక కార్తీ-త్రిషల కలయికలో ఒక నీటి మడుగు మధ్యలో వచ్చే ఒక సీన్ వారెవా అనిపిస్తుందంతే. సినిమాలో స్టాండౌట్గా నిలిచిన సన్నివేశం అది. సినిమాలోని మహా మహా నటీనటులను డామినేట్ చేస్తూ కార్తీ-త్రిష హైలైట్ అవ్వడం పెద్ద విషయమే.
This post was last modified on April 29, 2023 6:27 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…