గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై తమిళంలో ఆ అంచనాల మేర విజయాన్ని అందుకుంది మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్. కానీ తెలుగులో మాత్రం ఆ చిత్రం నిరాశ పరిచింది. మన ప్రేక్షకులకు ఆ సినిమా అంతగా రుచించలేదు. కథాకథనాలు.. యాక్షన్ ఘట్టాలు బాహుబలి తరహలో ఊహించుకున్న మన ప్రేక్షకులు నిరాశ చెందారు. అలా అని అది తీసిపడేయదగ్గ సినిమా కాదు. అందులో కొన్ని ఆకర్షణలున్నాయి. ముఖ్యంగా ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులందరూ ఆకట్టుకున్నారు.
శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్-2కు కూడా ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ హైలైట్గా నిలిచింది. ఐతే అందరిలోకి ఎక్కువ ఆకట్టుకుంది… ప్రేక్షకులను కట్టి పడేసింది మాత్రం కార్తీ-త్రిషల జోడీనే అని చెప్పాలి.
పొన్నియన్ సెల్వన్-2లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ విక్రమ్ ఉన్నాడు. ఒకప్పటి ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ఉంది. ఇంకా ఎంతోమంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. కానీ వాళ్లందరినీ మించి ప్రేక్షకులను ఎక్కువ మెప్పిస్తోంది కార్తీ, త్రిషలే. కార్తీ మామూలుగానే తెరపై కనిపిస్తే హుషారు వస్తుంది. ఈ సినిమాలో అతను మరింతగా ఆకట్టుకున్నాడు. తన చలాకీ నటనతో ప్రతి సన్నివేశంలోనూ మెప్పించాడు.
ఇక వయసు పెరిగే కొద్దీ త్రిషలో అందం, ఆకర్షణ పెరిగిపోతుండటం విశేషం. ఆమె కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ చూపు తిప్పుకోవడం కష్టం. కెరీర్ ఆరంభంలో కూడా ఇంత అందంగా లేదు అనిపించేలా ఈ సినిమాలో ముగ్ధ మనోహరంగా కనిపించిందామె. ఇక కార్తీ-త్రిషల కలయికలో ఒక నీటి మడుగు మధ్యలో వచ్చే ఒక సీన్ వారెవా అనిపిస్తుందంతే. సినిమాలో స్టాండౌట్గా నిలిచిన సన్నివేశం అది. సినిమాలోని మహా మహా నటీనటులను డామినేట్ చేస్తూ కార్తీ-త్రిష హైలైట్ అవ్వడం పెద్ద విషయమే.
This post was last modified on April 29, 2023 6:27 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…