గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై తమిళంలో ఆ అంచనాల మేర విజయాన్ని అందుకుంది మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్. కానీ తెలుగులో మాత్రం ఆ చిత్రం నిరాశ పరిచింది. మన ప్రేక్షకులకు ఆ సినిమా అంతగా రుచించలేదు. కథాకథనాలు.. యాక్షన్ ఘట్టాలు బాహుబలి తరహలో ఊహించుకున్న మన ప్రేక్షకులు నిరాశ చెందారు. అలా అని అది తీసిపడేయదగ్గ సినిమా కాదు. అందులో కొన్ని ఆకర్షణలున్నాయి. ముఖ్యంగా ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులందరూ ఆకట్టుకున్నారు.
శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్-2కు కూడా ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ హైలైట్గా నిలిచింది. ఐతే అందరిలోకి ఎక్కువ ఆకట్టుకుంది… ప్రేక్షకులను కట్టి పడేసింది మాత్రం కార్తీ-త్రిషల జోడీనే అని చెప్పాలి.
పొన్నియన్ సెల్వన్-2లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ విక్రమ్ ఉన్నాడు. ఒకప్పటి ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ఉంది. ఇంకా ఎంతోమంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. కానీ వాళ్లందరినీ మించి ప్రేక్షకులను ఎక్కువ మెప్పిస్తోంది కార్తీ, త్రిషలే. కార్తీ మామూలుగానే తెరపై కనిపిస్తే హుషారు వస్తుంది. ఈ సినిమాలో అతను మరింతగా ఆకట్టుకున్నాడు. తన చలాకీ నటనతో ప్రతి సన్నివేశంలోనూ మెప్పించాడు.
ఇక వయసు పెరిగే కొద్దీ త్రిషలో అందం, ఆకర్షణ పెరిగిపోతుండటం విశేషం. ఆమె కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ చూపు తిప్పుకోవడం కష్టం. కెరీర్ ఆరంభంలో కూడా ఇంత అందంగా లేదు అనిపించేలా ఈ సినిమాలో ముగ్ధ మనోహరంగా కనిపించిందామె. ఇక కార్తీ-త్రిషల కలయికలో ఒక నీటి మడుగు మధ్యలో వచ్చే ఒక సీన్ వారెవా అనిపిస్తుందంతే. సినిమాలో స్టాండౌట్గా నిలిచిన సన్నివేశం అది. సినిమాలోని మహా మహా నటీనటులను డామినేట్ చేస్తూ కార్తీ-త్రిష హైలైట్ అవ్వడం పెద్ద విషయమే.
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…