Movie News

రవితేజ సినిమాని పట్టించుకోలేదు

కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫట్టు మనిపించినా ఓటీటీలో హిట్టవుతాయి. అయితే తాజాగా రవితేజ నుండి వచ్చిన ‘రావణాసుర’ థియేటర్స్ లో డిజాస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా ఓపెనింగ్ నుండే ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొల్పింది. తర్వాత విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత ఆసక్తి పెంచింది. తీరా సినిమా రిలీజయ్యాక చూస్తే సాదా సీదా కంటెంట్ తో థ్రిల్ చేయలేక చతికల పడింది.

తాజాగా ఈ సినిమా ఎమేజాన్ లో రిలీజైంది. సదరు ఓటీటీ సంస్థ కూడా సరైన ప్రమోషన్స్ లేకుండానే డైరెక్ట్ గా రిలీజ్ చేసేశారు. ఇక రవితేజ కానీ , టీం కానీ ఎవరూ ప్రమోట్ చేయలేదు. దీంతో సినిమా ఓటీటీ లో రిలీజైన సంగతి కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. ఆప్ ఓపెన్ చేసి ఓహో నెల తిరగకుండానే రవితేజ సినిమా వచ్చేసింది అనుకుంటున్నారు తప్ప వ్యూస్ ఇవ్వడం లేదు.

ఏదేమైనా రవితేజ వంటి స్టార్ హీరో సినిమా ఓటీటీ లో రిలీజ్ అంటే అంతో ఇంతో సోషల్ మీడియాలో సందడి ఉండాలి కానీ థియేటర్స్ లో ప్రేక్షకులు పట్టించుకోని ఈ సినిమా ఇప్పుడు స్మాల్ స్క్రీన్ లో రిలీజ్ చేసిన సంస్థ కూడా పట్టించుకోవడం లేదు అనుకుంటూ. ఇక ఇదే వారంలో నాని దసరా నెట్ ఫ్లిక్స్ లో రావడంతో రవితేజ సినిమాను ఆడియన్స్ కూడా లైట్ తీసుకుంటున్నట్టున్నారు.

This post was last modified on April 28, 2023 8:22 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago