యువ కథానాయకుడు నితిన్ తన సొంత బేనర్ శ్రేష్ట్ మూవీస్లో ఒక ప్రతిష్టాత్మక చిత్రం చేయడానికి కొన్నేళ్ల ముందు పెద్ద కసరత్తే చేశాడు. లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య దర్శకత్వంలో చేయాలనుకున్న ఆ సినిమానే.. ‘పవర్ పేట’. తమిళంలో వెట్రిమారన్ తీసిన ‘వడ చెన్నై’ తరహాలోనే ఆంధ్రా ప్రాంతంలో రౌడీలకు పెట్టింది పేరైన పవర్ పేట నేపథ్యంలో రా అండ్ రస్టిక్గా ఒక రౌడీ కథను తీయాలన్నది కృష్ణచైతన్య ఆలోచన. ఈ సినిమాను రెండు మూడు భాగాలుగా తీయడానికి ప్రణాళికలు రచించారు.
ఈ సినిమాలో తాను రకరకాల వయసుల్లో, డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తానని.. తన కెరీర్లో ఇంత దాకా పడని కష్టం, పెట్టని ఖర్చు ఈ సినిమాకు ఉంటుందని నితిన్ తెలిపాడు. ఇక ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే ఆలస్యం అనుకున్న దశలో ఆశ్చర్యకరంగా నితిన్ వెనక్కి తగ్గాడు. సినిమా అటకెక్కేసింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకున్న కృష్ణచైతన్య మళ్లీ ఇదే కథను శర్వానంద్తో తీయడానికి ప్రయత్నించాడు. ఈ ప్రాజెక్టుకు కూడా అనౌనన్స్మెంట్ తర్వాత బ్రేక్ పడింది.
ఇద్దరు హీరోలు వెనక్కి తగ్గాక ఇక ఈ ప్రాజెక్టు ముందుకు కదలడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా కృష్ణ చైతన్య మరో ప్రయత్నం చేశాడు. యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో విశ్వక్సేన్ను మెప్పించి, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ను ఒప్పించి ఎట్టకేలకు ఈ సినిమాను మొదలుపెట్టాడు. గురువారమే ఈ సినిమా ముహూర్త వేడుక జరుపుకుంది. ఈ సినిమాలో కనిపించబోయే రగ్డ్ లుక్లోనే ముహూర్త వేడుకకు హాజరయ్యాడు విశ్వక్.
ఈ చిత్రంలో విశ్వక్ కంటే పెద్ద వయసున్న అంజలి అతడికి జోడీగా నటించబోతోంది. ఇద్దరు పేరున్న హీరోలతో మొదలైనట్లే మొదలై ఆగిపోయిన సినిమాను సితార వాళ్లు ముందుకు తీసుకెళ్తుండటం, పెద్ద బడ్జెట్లో సినిమాను నిర్మించబోతుండటం విశేషమే. సితార లాంటి సంస్థ అండ దొరికిందంటే ఇక ఈ ప్రాజెక్టుకు ఏ అడ్డంకీ లేనట్లే. మరి కృష్ణచైతన్య ఈ చిత్రాన్ని మిస్ అయినందుకు నితిన్, శర్వానంద్ ఫీలయ్యేలా చేస్తాడా.. లేక సేఫ్ అయ్యాం అనుకునేలా చేస్తాడా అన్నది ఆసక్తికరం.
This post was last modified on April 27, 2023 7:02 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…