హీరోగా ఇప్పటిదాకా అక్కినేని అఖిల్ కోరుకున్న సక్సెస్ రాలేదు. కానీ అతడి సినిమాలకు క్రేజ్ అయితే తక్కువేమీ కాదు. తొలి చిత్రం ‘అఖిల్’ రిలీజ్కు ముందు యుఫోరియా గురించి అక్కినేని అభిమానులను అడిగితే కథలు కథలుగా చెబుతారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తొలి సినిమాకు కూడా ఇంత హంగామా లేదంటే అతిశయోక్తి కాదు.
2015లో ‘అఖిల్’ సినిమా రిలీజైతే.. అప్పట్లోనే ఈ చిత్రం రూ.46 కోట్ల బిజినెస్ చేయడం విశేషం. సినిమాకు మరీ బ్యాడ్ టాక్ వచ్చింది కానీ.. లేకుంటే బాక్సాఫీస్ మోత మోగేది. అఖిల్ నేరుగా స్టార్ కాదు, సూపర్ స్టార్ అయిపోయేవాడు. అంత బ్యాడ్ టాక్తోనూ తొలి రోజు వసూళ్లలో ‘అఖిల్’ రికార్డు నెలకొల్పడం విశేషం. ఇప్పటికీ ఒక డెబ్యూ హీరో సినిమాకు జరిగిన అత్యధిక బిజినెస్ రికార్డు ‘అఖిల్’ పేరిటే ఉంది.
అంతే కాదు.. టైర్-2 హీరోల్లో థియేట్రికల్ హక్కుల ద్వారా అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టిన సినిమాల్లో ‘అఖిల్’ మూడో స్థానంలో ఉండటం గమనార్హం. ఓవరాల్గా ఈ జాబితాలో విజయ్ దేవరకొండ మూవీ ‘లైగర్’ రూ.90 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. దసరా (రూ.50 కోట్లు), అఖిల్ (రూ.46 కోట్లు), ది వారియర్ (రూ.40 కోట్లు) వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు అఖిల్ కొత్త చిత్రం ‘ఏజెంట్’ రూ.37 కోట్ల థియేట్రికల్ బిజినెస్తో ఐదో స్థానానికి చేరుకుంది. అంటే టాప్-5లో రెండు అఖిల్ సినిమాలున్నాయి.
ఐతే తొలి నాలుగు చిత్రాల్లో ఉన్న సినిమాల్లో ఒక్క ‘దసరా’ మాత్రమే టార్గెట్ను రీచ్ అయింది. ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ కావడమే కాక.. నైజాం వరకు బ్లాక్బస్టర్ అయింది. మరి ‘అఖిల్’తో నిరాశ పరిచిన అఖిల్.. ‘ఏజెంట్’తో బయ్యర్లను సేఫ్ జోన్లోకి తీసుకొచ్చి కెరీర్లో తొలి పెద్ద హిట్ కొడతాడేమో చూడాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఏజెంట్’ ఈ శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది.
This post was last modified on April 27, 2023 3:00 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…