విడుదలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉన్నప్పటికీ మహేష్ బాబు 28 పదే పదే వార్తల్లోకి వస్తోంది. అయితే షూటింగ్ కు సంబంధించిన విశేషాలతో కాదు. దేనికీ ఆధారాలు లేని వైరుధ్యమైన ప్రచారాలతో. ఇటీవలే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ కం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి చిన్న బ్రేక్ ఇచ్చారు. సహజంగా మహేష్ వేసవి సెలవులను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోడు. ఫ్యామిలీకి ఆ సీజన్ ని ఇచ్చేసి విదేశాలకు వెళ్లిపోవడం ముందు నుంచి ఉన్నదే. ఈసారి కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడు. కానీ బయట జరుగుతున్న టాక్ ఫ్యాన్స్ లో అయోమయం రేపుతోంది.
వాటి ప్రకారం త్రివిక్రమ్ ఫైనల్ చేసిన స్క్రిప్ట్ ఇప్పటికీ నచ్చలేదని, అందుకే బ్రేక్ ఇచ్చారని, హీరో అడిగిన కరెక్షన్లు చేసి త్వరలోనే ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తారని ఏదేదో అంటున్నారు. దీనికి కనెక్ట్ అవుతున్న ఒక బ్యాక్ స్టోరీ ఉంది. త్రివిక్రమ్ వినోదయ సితం రీమేక్ పట్టాలు ఎక్కేదాకా స్క్రిప్ట్ విషయంలో అంతా తానై చూసుకున్నాడు. అంతకు ముందు బీమ్లా నాయక్ కోసం చాలా టైం ఖర్చు పెట్టాడు. వీటివల్లే మహేష్ 28కి అంత బెస్ట్ గా రాయలేకపోయారని కొందరు అభిమానుల ఫీలింగ్. ఇలా మల్టీటాస్కింగ్ చేయడం వల్ల తమ హీరో అవుట్ ఫుట్ క్వాలిటీ తగ్గుతుందని భావిస్తున్నారు
ఇదంతా ఎలా ఉన్నా మహేష్ త్రివిక్రమ్ 2024 సంక్రాంతి డెడ్ లైన్ కి కట్టుబడే ఉన్నారు. మళ్ళీ వాయిదా వేసే ప్రసక్తి ఉండదు. పైగా తీస్తున్నది బాహుబలి ఆర్ఆర్ఆర్ లాగా వంద కోట్ల గ్రాఫిక్స్ మూవీ కాదు. ఖర్చు ఉంటుంది కానీ నీట్ గా అల వైకుంఠపురములో స్టైల్ లో రీజనబుల్ గా తీస్తారని చెప్పడంలో మాత్రం డౌట్ అక్కర్లేదు. కనీసం నవంబర్ కంతా పోస్ట్ ప్రొడక్షన్ ని పూర్తి చేస్తే డిసెంబర్ ని ప్రమోషన్లకు వాడుకోవచ్చు. ఎటొచ్చి చివరి నిముషం హడవిడి లేకుండా చూసుకోవడం చాలా అవసరం. ట్విట్టర్ లో మహేష్ బాబు 28 ట్రెండింగ్ లోకి రావడం చూస్తే ఫ్యాన్స్ భాదని అర్థం చేసుకోచ్చు.
This post was last modified on April 27, 2023 12:20 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…