విడుదలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉన్నప్పటికీ మహేష్ బాబు 28 పదే పదే వార్తల్లోకి వస్తోంది. అయితే షూటింగ్ కు సంబంధించిన విశేషాలతో కాదు. దేనికీ ఆధారాలు లేని వైరుధ్యమైన ప్రచారాలతో. ఇటీవలే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ కం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి చిన్న బ్రేక్ ఇచ్చారు. సహజంగా మహేష్ వేసవి సెలవులను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోడు. ఫ్యామిలీకి ఆ సీజన్ ని ఇచ్చేసి విదేశాలకు వెళ్లిపోవడం ముందు నుంచి ఉన్నదే. ఈసారి కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడు. కానీ బయట జరుగుతున్న టాక్ ఫ్యాన్స్ లో అయోమయం రేపుతోంది.
వాటి ప్రకారం త్రివిక్రమ్ ఫైనల్ చేసిన స్క్రిప్ట్ ఇప్పటికీ నచ్చలేదని, అందుకే బ్రేక్ ఇచ్చారని, హీరో అడిగిన కరెక్షన్లు చేసి త్వరలోనే ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తారని ఏదేదో అంటున్నారు. దీనికి కనెక్ట్ అవుతున్న ఒక బ్యాక్ స్టోరీ ఉంది. త్రివిక్రమ్ వినోదయ సితం రీమేక్ పట్టాలు ఎక్కేదాకా స్క్రిప్ట్ విషయంలో అంతా తానై చూసుకున్నాడు. అంతకు ముందు బీమ్లా నాయక్ కోసం చాలా టైం ఖర్చు పెట్టాడు. వీటివల్లే మహేష్ 28కి అంత బెస్ట్ గా రాయలేకపోయారని కొందరు అభిమానుల ఫీలింగ్. ఇలా మల్టీటాస్కింగ్ చేయడం వల్ల తమ హీరో అవుట్ ఫుట్ క్వాలిటీ తగ్గుతుందని భావిస్తున్నారు
ఇదంతా ఎలా ఉన్నా మహేష్ త్రివిక్రమ్ 2024 సంక్రాంతి డెడ్ లైన్ కి కట్టుబడే ఉన్నారు. మళ్ళీ వాయిదా వేసే ప్రసక్తి ఉండదు. పైగా తీస్తున్నది బాహుబలి ఆర్ఆర్ఆర్ లాగా వంద కోట్ల గ్రాఫిక్స్ మూవీ కాదు. ఖర్చు ఉంటుంది కానీ నీట్ గా అల వైకుంఠపురములో స్టైల్ లో రీజనబుల్ గా తీస్తారని చెప్పడంలో మాత్రం డౌట్ అక్కర్లేదు. కనీసం నవంబర్ కంతా పోస్ట్ ప్రొడక్షన్ ని పూర్తి చేస్తే డిసెంబర్ ని ప్రమోషన్లకు వాడుకోవచ్చు. ఎటొచ్చి చివరి నిముషం హడవిడి లేకుండా చూసుకోవడం చాలా అవసరం. ట్విట్టర్ లో మహేష్ బాబు 28 ట్రెండింగ్ లోకి రావడం చూస్తే ఫ్యాన్స్ భాదని అర్థం చేసుకోచ్చు.
This post was last modified on April 27, 2023 12:20 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…