విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఇమేజ్ కి కట్టుబడని హీరో శ్రీవిష్ణు. రాజరాజ చోర బాగా ఆడినా ఆ తర్వాత వచ్చిన అర్జునా ఫల్గునా, భళా తందనానలు డిజాస్టర్ కావడంతో ఈసారి మరింత జాగ్రత్తగా చేసిన సినిమా సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ వచ్చే నెల మే 18న విడుదల కాబోతోంది. చూచాయగా లైన్ ఏంటో వివరిస్తూ కట్ చేసిన టీజర్ ఇందాకా రిలీజ్ చేశారు. శ్రీవిష్ణు ఈసారి కూడా ఎక్కువ కామెడీనే నమ్ముకుని ఓ వెరైటీ ప్రేమకథతో పలకరించబోతున్నాడు. చిన్న వీడియోలో గుట్టు చెప్పేశారు
బాలు ఉరఫ్ బాలసుబ్రమణ్యం ఏషియన్ మల్టీప్లెక్సులో టికెట్ కౌంటర్ ఉద్యోగి. టీనేజ్ కొచ్చాక బాగా మనసుపడిన అమ్మాయి చివరికి హ్యాండ్ ఇచ్చి రాఖీ కట్టడంతో అప్పటి నుంచి విరక్తి పుట్టి పరిచయమైన ప్రతి లేడీ నుంచి కట్టించుకోవడం అలవాటుగా మార్చుకుంటాడు. ఇదో ప్రహసనంగా మారిపోయి చేతికి వందల రాఖీలు వచ్చి పడతాయి. ఆఖరికి ఇతనంటే ఇష్టపడే ఓ బ్యూటీ(రెబ్బ మోనికా జాన్)ని సైతం రక్షాబంధన్ అడుగుతాడు. ఇంతకీ కుర్రాడు ఇంత వైరాగ్యంలోకి ఎందుకు వెళ్ళాడు, పైకి నవ్వుతున్నా అతని వెనుక ఉన్న ట్విస్టు ఏంటో తెలియాలంటే సామజవరగమన చూడాలి.
కాన్సెప్ట్ కొత్తగానే ఉంది. పూర్తి ఫన్ ని బేస్ చేసుకుని రామ్ అబ్బరాజు తెరకెక్కించారు. కొంత గ్యాప్ తర్వాత శ్రీవిష్ణు మళ్ళీ తనలో కామెడీ టైమింగ్ ని బయటికి తీశాడు. భాను భోగవరపు కథ, నందు సంభాషణలు అందించిన సామజవరగమనకు రామ్ రెడ్డి ఛాయాగ్రహణం సమకూర్చారు. బడ్జెట్ లో తీసిన చిత్రమే అయినప్పటికీ యూత్ ని ఆకట్టుకునే అంశాలు బాగానే దట్టించారు. చక్కని హాస్యం ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారని జాతిరత్నాలు లాంటివి నిరూపించాయి. ఎంటర్ టైన్మెంట్ కి కాస్త ఎమోషనల్ టచ్ ప్లస్ లవ్ ఉంటే చాలు సామజవరగమన సులభంగా పాసైపోతుంది.
This post was last modified on April 27, 2023 12:15 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…