పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది విరూపాక్ష సినిమా. సాయిధరమ్ తేజ్, సంయుక్త జంటగా యువ దర్శకుడు కార్తీక్ దండు రూపొందించిన ఈ చిత్రం గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫుల్ పాజిటివ్ రావడం.. సమీక్షలు బాగుండటంతో తొలి రోజు సాయంత్రం నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తోంది.
ఉదయంతో పోలిస్తే సాయంత్రానికి వసూళ్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. వీకెండ్లో ఈ సినిమా రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది. యుఎస్లో ఈ సినిమా మిలియన్ డాలర్ మార్కు దిశగా దూసుకెళ్తోంది. ఏదైనా సినిమా హిట్ అయితే దాని సీక్వెల్ గురించి చర్చ జరగడం ప్రస్తుత ట్రెండు. సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండి, కథను పొడిగించడానికి అవకాశం ఉన్నపుడు మేకర్స్ కూడా ఆ దిశగా చిన్న హింట్ ఇచ్చి వదిలిపెడతారు.
విరూపాక్ష సినిమా విషయంలోనూ అదే జరిగింది. సినిమా సుఖాంతం అయి.. అంతా సద్దుమణిగింది అనుకున్నాక తేజు కళ్లు చిత్రంగా మారుతాయి. అంతటితో ఎండ్ కార్డ్ పడుతుంది. అందరినీ రక్షించిన హీరో తనే దయ్యం పట్టినట్లుగా కనిపించడంతో కథ ఇంకా ముగియలేదు, సెకండ్ పార్ట్ ఉంటుందన్న భావన కలుగుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక నెటిజన్ ట్విట్టర్లో సాయిధరమ్ తేజ్ను ట్యాగ్ చేస్తూ.. సీక్వెల్ ఉంటుందా అని ప్రశ్నించాడు. దీనికి తేజు బదులిస్తూ.. ఉంది కాబట్టే కదా హింట్ ఇచ్చాం అన్నాడు.
ఇంత పెద్ద హిట్ అయిన సినిమా, కథను పొడిగించడానికీ స్కోప్ ఉంది.. అలాంటపుడు సీక్వెల్ తీయకుండా వదిలిపెట్టే ఛాన్సే లేదు. గతంలో ఇదే జానర్లో తెరకెక్కిన కార్తికేయ సినిమాను కూడా ఫ్రాంఛైజీగా మార్చిన సంగతి తెలిసిందే. అందులో రెండో సినిమా ఇంకా పెద్ద హిట్టయింది. మరి విరూపాక్ష-2 ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి.
This post was last modified on April 24, 2023 8:04 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…