ఖుషి సినిమా పేరెత్తితే తెలుగు ప్రేక్షకులకు ఒక పులకింత కలుగుతుంది. ఇది తమిళ చిత్రానికి రీమేకే అయినప్పటికీ.. ఒరిజినల్ వెర్షన్తో పోలిస్తే ఎంతో మరుగ్గా తీర్చిదిద్దడంతో ఇంకా పెద్ద బ్లాక్బస్టర్ను చేశారు ప్రేక్షకులు. అలాంటి కల్ట్ బ్లాక్బస్టర్ సినిమా పేరును శివ నిర్వాణ తన కొత్త చిత్రానికి పెట్టుకున్నాడు.
విజయ్ దేవరకొండ, సమంతల కలయికలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్ను ఖరారు చేయగా.. పవన్ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ చిత్ర బృందం మొండిగా ముందుకు వెళ్లపోయింది. ఈ సినిమాకు వేరే పేర్లు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ.. ‘ఖుషి’ తరహాలో మంచి ఫీల్ ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో ఆ టైటిలే ఖరారు చేసినట్లు శివ కొన్ని రోజుల కిందటే వెల్లడించాడు. ఐతే ఈ టైటిల్ పెట్టడం వెనుక ఇంకో కారణం కూడా ఉందని.. పాత ‘ఖుషి’తో దీనికి ఇంకో లింక్ కూడా ఉందని చిత్ర వర్గాల సమాచారం.
‘ఖుషి’ సినిమాలో ‘ఇగో’ అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అనే విషయం తెలిసిందే. హీరో హీరోయిన్ల మధ్య గొడవ మొదలై.. అది చాలా పెద్ద స్థాయికి వెళ్లడానికి.. ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డ జంట అంతకంతకూ దూరం అయిపోవడానికి కారణం ‘ఇగో’నే. ముఖ్యంగా హీరోయిన్కు అహం కొంచెం ఎక్కువే ఉంటుంది. ఒక సీన్లో ఆమె ఇగో గురించి కామెడీ కూడా చేస్తాడు పవన్. కాగా కొత్త ‘ఖుషి’లో కూడా ఇగో అనేది కథను మలుపు తిప్పే పాయింట్గా ఉంటుందట. ఇందులో విజయ్, సమంత ముందుగా కలవడానికి.. ఆ తర్వాత విడిపోవడానికి.. ‘ఇగో’నే కారణం అవుతుందట.
ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోకుండానే పీకల్లోతు ప్రేమలో దిగిపోయిన ఈ జంట.. ఇగో క్లాష్ కారణంగా విడిపోవడం.. ఆపై ఇద్దరి మధ్య మరింత దూరం పెరగడం.. చివరికి అనూహ్య పరిణామాల మధ్య ఆ జంట కలవడం జరుగుతుందట. కథ వరకు మామూలుగానే అనిపించినా.. కథనం ఆహ్లాదభరితంగా, వినోదాత్మకంగా ఉంటుందని.. నిన్ను కోరి, మజిలీ తర్వాత శివ మార్కు లవ్ స్టోరీగా ఇది ఉంటుందని.. కచ్చితంగా మంచి ఫలితాన్ని అందుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 24, 2023 5:58 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…