ఖుషి సినిమా పేరెత్తితే తెలుగు ప్రేక్షకులకు ఒక పులకింత కలుగుతుంది. ఇది తమిళ చిత్రానికి రీమేకే అయినప్పటికీ.. ఒరిజినల్ వెర్షన్తో పోలిస్తే ఎంతో మరుగ్గా తీర్చిదిద్దడంతో ఇంకా పెద్ద బ్లాక్బస్టర్ను చేశారు ప్రేక్షకులు. అలాంటి కల్ట్ బ్లాక్బస్టర్ సినిమా పేరును శివ నిర్వాణ తన కొత్త చిత్రానికి పెట్టుకున్నాడు.
విజయ్ దేవరకొండ, సమంతల కలయికలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్ను ఖరారు చేయగా.. పవన్ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ చిత్ర బృందం మొండిగా ముందుకు వెళ్లపోయింది. ఈ సినిమాకు వేరే పేర్లు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ.. ‘ఖుషి’ తరహాలో మంచి ఫీల్ ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో ఆ టైటిలే ఖరారు చేసినట్లు శివ కొన్ని రోజుల కిందటే వెల్లడించాడు. ఐతే ఈ టైటిల్ పెట్టడం వెనుక ఇంకో కారణం కూడా ఉందని.. పాత ‘ఖుషి’తో దీనికి ఇంకో లింక్ కూడా ఉందని చిత్ర వర్గాల సమాచారం.
‘ఖుషి’ సినిమాలో ‘ఇగో’ అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అనే విషయం తెలిసిందే. హీరో హీరోయిన్ల మధ్య గొడవ మొదలై.. అది చాలా పెద్ద స్థాయికి వెళ్లడానికి.. ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డ జంట అంతకంతకూ దూరం అయిపోవడానికి కారణం ‘ఇగో’నే. ముఖ్యంగా హీరోయిన్కు అహం కొంచెం ఎక్కువే ఉంటుంది. ఒక సీన్లో ఆమె ఇగో గురించి కామెడీ కూడా చేస్తాడు పవన్. కాగా కొత్త ‘ఖుషి’లో కూడా ఇగో అనేది కథను మలుపు తిప్పే పాయింట్గా ఉంటుందట. ఇందులో విజయ్, సమంత ముందుగా కలవడానికి.. ఆ తర్వాత విడిపోవడానికి.. ‘ఇగో’నే కారణం అవుతుందట.
ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోకుండానే పీకల్లోతు ప్రేమలో దిగిపోయిన ఈ జంట.. ఇగో క్లాష్ కారణంగా విడిపోవడం.. ఆపై ఇద్దరి మధ్య మరింత దూరం పెరగడం.. చివరికి అనూహ్య పరిణామాల మధ్య ఆ జంట కలవడం జరుగుతుందట. కథ వరకు మామూలుగానే అనిపించినా.. కథనం ఆహ్లాదభరితంగా, వినోదాత్మకంగా ఉంటుందని.. నిన్ను కోరి, మజిలీ తర్వాత శివ మార్కు లవ్ స్టోరీగా ఇది ఉంటుందని.. కచ్చితంగా మంచి ఫలితాన్ని అందుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 24, 2023 5:58 pm
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు.…
కొవిడ్ వల్ల సినీ పరిశ్రమలు ఎలా కుదేలయ్యాయో తెలిసిందే. కానీ ఆ టైంలో మలయాళ ఇండస్ట్రీ సైతం ఇబ్బంది పడింది…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుల మద్య స్నేహబంధం ఇప్పటిది కాదు. ఎప్పుడో చంద్రబాబు…