ఖుషి సినిమా పేరెత్తితే తెలుగు ప్రేక్షకులకు ఒక పులకింత కలుగుతుంది. ఇది తమిళ చిత్రానికి రీమేకే అయినప్పటికీ.. ఒరిజినల్ వెర్షన్తో పోలిస్తే ఎంతో మరుగ్గా తీర్చిదిద్దడంతో ఇంకా పెద్ద బ్లాక్బస్టర్ను చేశారు ప్రేక్షకులు. అలాంటి కల్ట్ బ్లాక్బస్టర్ సినిమా పేరును శివ నిర్వాణ తన కొత్త చిత్రానికి పెట్టుకున్నాడు.
విజయ్ దేవరకొండ, సమంతల కలయికలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్ను ఖరారు చేయగా.. పవన్ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ చిత్ర బృందం మొండిగా ముందుకు వెళ్లపోయింది. ఈ సినిమాకు వేరే పేర్లు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ.. ‘ఖుషి’ తరహాలో మంచి ఫీల్ ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో ఆ టైటిలే ఖరారు చేసినట్లు శివ కొన్ని రోజుల కిందటే వెల్లడించాడు. ఐతే ఈ టైటిల్ పెట్టడం వెనుక ఇంకో కారణం కూడా ఉందని.. పాత ‘ఖుషి’తో దీనికి ఇంకో లింక్ కూడా ఉందని చిత్ర వర్గాల సమాచారం.
‘ఖుషి’ సినిమాలో ‘ఇగో’ అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అనే విషయం తెలిసిందే. హీరో హీరోయిన్ల మధ్య గొడవ మొదలై.. అది చాలా పెద్ద స్థాయికి వెళ్లడానికి.. ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డ జంట అంతకంతకూ దూరం అయిపోవడానికి కారణం ‘ఇగో’నే. ముఖ్యంగా హీరోయిన్కు అహం కొంచెం ఎక్కువే ఉంటుంది. ఒక సీన్లో ఆమె ఇగో గురించి కామెడీ కూడా చేస్తాడు పవన్. కాగా కొత్త ‘ఖుషి’లో కూడా ఇగో అనేది కథను మలుపు తిప్పే పాయింట్గా ఉంటుందట. ఇందులో విజయ్, సమంత ముందుగా కలవడానికి.. ఆ తర్వాత విడిపోవడానికి.. ‘ఇగో’నే కారణం అవుతుందట.
ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోకుండానే పీకల్లోతు ప్రేమలో దిగిపోయిన ఈ జంట.. ఇగో క్లాష్ కారణంగా విడిపోవడం.. ఆపై ఇద్దరి మధ్య మరింత దూరం పెరగడం.. చివరికి అనూహ్య పరిణామాల మధ్య ఆ జంట కలవడం జరుగుతుందట. కథ వరకు మామూలుగానే అనిపించినా.. కథనం ఆహ్లాదభరితంగా, వినోదాత్మకంగా ఉంటుందని.. నిన్ను కోరి, మజిలీ తర్వాత శివ మార్కు లవ్ స్టోరీగా ఇది ఉంటుందని.. కచ్చితంగా మంచి ఫలితాన్ని అందుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…