ఖుషి సినిమా పేరెత్తితే తెలుగు ప్రేక్షకులకు ఒక పులకింత కలుగుతుంది. ఇది తమిళ చిత్రానికి రీమేకే అయినప్పటికీ.. ఒరిజినల్ వెర్షన్తో పోలిస్తే ఎంతో మరుగ్గా తీర్చిదిద్దడంతో ఇంకా పెద్ద బ్లాక్బస్టర్ను చేశారు ప్రేక్షకులు. అలాంటి కల్ట్ బ్లాక్బస్టర్ సినిమా పేరును శివ నిర్వాణ తన కొత్త చిత్రానికి పెట్టుకున్నాడు.
విజయ్ దేవరకొండ, సమంతల కలయికలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్ను ఖరారు చేయగా.. పవన్ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ చిత్ర బృందం మొండిగా ముందుకు వెళ్లపోయింది. ఈ సినిమాకు వేరే పేర్లు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ.. ‘ఖుషి’ తరహాలో మంచి ఫీల్ ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో ఆ టైటిలే ఖరారు చేసినట్లు శివ కొన్ని రోజుల కిందటే వెల్లడించాడు. ఐతే ఈ టైటిల్ పెట్టడం వెనుక ఇంకో కారణం కూడా ఉందని.. పాత ‘ఖుషి’తో దీనికి ఇంకో లింక్ కూడా ఉందని చిత్ర వర్గాల సమాచారం.
‘ఖుషి’ సినిమాలో ‘ఇగో’ అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అనే విషయం తెలిసిందే. హీరో హీరోయిన్ల మధ్య గొడవ మొదలై.. అది చాలా పెద్ద స్థాయికి వెళ్లడానికి.. ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డ జంట అంతకంతకూ దూరం అయిపోవడానికి కారణం ‘ఇగో’నే. ముఖ్యంగా హీరోయిన్కు అహం కొంచెం ఎక్కువే ఉంటుంది. ఒక సీన్లో ఆమె ఇగో గురించి కామెడీ కూడా చేస్తాడు పవన్. కాగా కొత్త ‘ఖుషి’లో కూడా ఇగో అనేది కథను మలుపు తిప్పే పాయింట్గా ఉంటుందట. ఇందులో విజయ్, సమంత ముందుగా కలవడానికి.. ఆ తర్వాత విడిపోవడానికి.. ‘ఇగో’నే కారణం అవుతుందట.
ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోకుండానే పీకల్లోతు ప్రేమలో దిగిపోయిన ఈ జంట.. ఇగో క్లాష్ కారణంగా విడిపోవడం.. ఆపై ఇద్దరి మధ్య మరింత దూరం పెరగడం.. చివరికి అనూహ్య పరిణామాల మధ్య ఆ జంట కలవడం జరుగుతుందట. కథ వరకు మామూలుగానే అనిపించినా.. కథనం ఆహ్లాదభరితంగా, వినోదాత్మకంగా ఉంటుందని.. నిన్ను కోరి, మజిలీ తర్వాత శివ మార్కు లవ్ స్టోరీగా ఇది ఉంటుందని.. కచ్చితంగా మంచి ఫలితాన్ని అందుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 24, 2023 5:58 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…