ఇంకో అయిదే రోజుల్లో ఏజెంట్ విడుదల కాబోతున్న నేపథ్యంలో అఖిల్ అభిమానులు ఎప్పుడెప్పుడు 28 వస్తుందాని ఎదురు చూస్తున్నారు. అంతగా బజ్ లేని పొన్నియిన్ సెల్వన్ 2 పోటీ పట్ల పెద్దగా ఆందోళన చెందడం లేదు. అయితే మంచి థియేటర్లలో పడితే ఏజెంట్ కి రీచ్ బాగుంటుందన్న అభిప్రాయంతో దానికి తగ్గట్టే ఎక్కడెక్కడ ఏ స్క్రీన్లు ఇస్తున్నారో చూసుకుంటున్నారు. అందులో భాగంగా ముందు హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో స్టార్ హీరోలు సెంటిమెంట్ గా భావించే సుదర్శన్ 35 ఎంఎంని చూశారు. అయితే దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ వల్ల పీఎస్ 2 కి కేటాయించారు.
ఈలోగా ఏజెంట్ నైజాం బిజినెస్ వ్యవహారాలకు సంబంధించి చర్చలు జాప్యాలు జరిగిన తర్వాత ఇది కూడా ఆయన చేతికే వచ్చిందని సమాచారం. దీంతో ఇప్పుడు సుదర్శన్ 35 కాస్తా ఏజెంట్ ఖాతాలో చేరింది. ఇదొక్కటే కాదు కూకట్పల్లి భ్రమరాంబ లాంటి కీలక థియేటర్లు అక్కినేని హీరోకి దక్కాయి. ముందు వీటిని పీఎస్ 2కి ఇచ్చినట్టు రెండు రోజుల క్రితమే పేపర్ యాడ్లు వచ్చాయి. గంటల వ్యవధిలో అనూహ్య పరిణామాలు జరిగిపోవడంతో ఏజెంట్ కి ఇదంతా సానుకూలంగా మారింది. వైజాగ్ జగదాంబ లాంటివి మిస్ అయినా అధిక శాతం క్వాలిటీ స్క్రీన్లు వచ్చేలా చూసుకున్నారు
ఫైనల్ గా థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని ప్రాంతాలకు రికవరబుల్ పద్ధతిలో చేసారు కాబట్టి ఫిగర్లు అంత సులభంగా బయట పడకపోవచ్చు. వరంగల్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత హైదరాబాద్ లో మరో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని మరో టాక్ ఉంది. ప్రభాస్ ఎలాగూ మిస్ అయ్యాడు కాబట్టి రామ్ చరణ్ ని తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతోందట. కంటెంట్ మీద అఖిల్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. పది నెలల శారీరక కష్టం మూడు సంవత్సరాల నిర్మాణం వెరసి బ్లాక్ బస్టర్ కు తక్కువ కాని ఫలితాన్ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు
This post was last modified on April 23, 2023 4:20 pm
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…