ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతా రాజమౌళిని అనుసరించక తప్పని పరిస్థితి నెలకొంది. ఆయనంటే నచ్చని వాళ్లు, అసూయ చెందే వాళ్లు కూడా తనలా భారీ సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో మేకింగ్, మార్కెటింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ ఆయన శైలిని అనుసరిస్తున్నారు. బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ సైతం రాజమౌళి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది.
ఆయన తాజాగా హాలీవుడ్ ఏజెన్సీ డబ్ల్యూఎంఈతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ సంస్థ నటీనటులు, టెక్నీషియన్లతో డీల్స్ చేస్తుంది. హాలీవుడ్లో బాగా ఫేమస్ అయిన ఈ సంస్థతో భాగస్వామ్యం అంటే భన్సాలీ తన తర్వాతి చిత్రాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీయబోతున్నట్లే. రాజమౌళి ఆయన కంటే ముందు ఇలాగే సీఏఏ అనే హాలీవుడ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నాడు. మహేష్ బాబుతో జక్కన్న తీయబోయే సినిమాకు ఈ సంస్థ సహకారం అందించనుంది.
‘ఆర్ఆర్ఆర్’తో భారతీయ సినిమా స్థాయి పెరిగిన నేపథ్యంలో మన దర్శకులతో సినిమాలు చేయడానికి హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు బాగానే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక భన్సాలీ తర్వాతి సినిమా గురించి ఇంకా ఏ వివరాలూ వెల్లడి కాలేదు కానీ.. అది భారీ స్థాయిలోనే ఉండబోతోందని అర్థమవుతోంది. ఇందులో టాలీవుడ్ స్టార్లలో ఎవరో ఒకరు నటిస్తే ఆశ్చర్యమేమీ లేదు.
జూనియర్ ఎన్టీఆర్తో పాటు మహేష్ బాబు, అల్లు అర్జున్లను భన్సాలీ వేర్వేరు సందర్భాల్లో కలిశాడు. ఎందుకు ఏంటి అన్న వివరాలు వెల్లడి కాలేదు కానీ.. వారి మధ్య సినిమా చర్చలు జరగకుండా ఉండి ఉండవు. కాబట్టి భన్సాలీ తర్వాతి చిత్రాల్లో వీరిలో ఎవరో ఒకరు ప్రత్యేక పాత్ర పోషించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇటీవలే తారక్ ‘వార్-2’లో ముఖ్య పాత్రకు ఎంపికైన సంగతి తెలిసిందే.
This post was last modified on April 23, 2023 7:50 am
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…
ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి…
సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు..…