కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలకు క్లీన్ యు, పెద్దల పర్యవేక్షణలో పిల్లలు కూడా చూడదగ్గట్లుగాఉంటే యు/ఎ, పెద్దలు మాత్రమే చూడదగ్గట్లుగా కొంచెం బోల్డ్, వయొలెంట్ ఉంటే ఎ.. ఇదీ దశాబ్దాలుగా సినిమాలకు సెన్సార్ బోర్డు ఇస్తున్న రేటింగ్స్. ఐతే త్వరలో ఈ విధానం మారతోబోతోంది. ఇప్పుడున్న పద్ధతిని ఎలా మార్చబోతున్నారు.. కొత్త విధానం ఎలా ఉండబోతోంది అన్నది తెలియదు కానీ మార్పు అయితే జరగబోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న సినిమాటోగ్రఫీ చట్టం 2023లో విప్లవాత్మక మార్పులు ఉండబోతున్నాయట.
ఇందులోప్రస్తుం సెన్సార్ బోర్డు అనుసరిస్తున్న U,A, U/A వర్గీకరణ విధానాన్ని కూడా మార్చబోతున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. సెన్సార్ బోర్డు సినిమాలకు రేటింగ్స్ ఇచ్చే విధానంపై ఎప్పట్నుంచో విమర్శలు ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా సెన్సారింగ్ ఉండట్లేదని.. దశాబ్దాల కిందటి విధానాన్ని అనుసరిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి.
మరి కొత్త సెన్సారింగ్ ఎలా ఉండబోతోందో చూడాలి. ఇదిలా ఉండగా.. సినిమా పైరసీని అరికట్టే దిశగా కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఇంటర్నెట్లో పైరేటెడ్ కంటెంట్ను అడ్డుకునే దిశగా ఈ బిల్లులో కీలక చట్టం తీసుకురానున్నారట. పరిశ్రమ కోరరుకున్నవన్నీ ఈ బిల్లులో ఉన్నాయని.. వారి అంచనాలకు తగ్గట్లు.. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా బిల్లును రూపొందించామని.. సినిమాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న విధానాలకు దగ్గరగా బిల్లు ఉంటుందని టాకూర్ తెలిపారు. తదుపరి సమావేశంలోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…