తన సంస్థలో పెద్ద సినిమాలు నిర్మిస్తూ తాజాగా మరో చిన్న బేనర్ స్టార్ట్ చేశారు దిల్ రాజు. ‘డీ ఆర్ పీ’ అనే సంస్థను మొదలు పెట్టి ఆ భాద్యతలు తన కూతురు హన్షిత , అన్న కొడుకు హర్షిత్ లకు అప్పగించాడు. ఈ బేనర్ లో వచ్చిన మొదటి సినిమా ‘బలగం’ చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుంది. గొప్ప పేరుతో పాటు డబ్బు కూడా తెచ్చి పెట్టింది.
ఈ సినిమా తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ లో మరో సినిమా రెడీ అయింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశారు. డాన్స్ మాస్టర్ యశ్ ను హీరోగా, శశి అనే రైటర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా నిర్మిస్తున్నాడు దిల్ రాజు. రోడ్ జర్నీ తో సాగే ఎంటర్టైనింగ్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఓ మంచి డేట్ లాక్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.
అయితే బలగం దారిలోనే ఈ సినిమాను కూడా ముందు నుండి జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ముందుగా తన కొత్త బేనర్ కి బ్రాండ్ గా నిలిచిన బలగంను వాడుకొని ఆ సినిమాకు ఫ్రమ్ ది మేకర్స్ ఆఫ్ బలగం అనే ట్యాగ్ వేయనున్నారు. ఆ తర్వాత ప్రీమియర్ షోలు , వరుస ప్రెస్ మీట్లు పెట్టే ఆలోచనలో ఉన్నారు. అన్నీ బలగంలా అద్భుతాలు చేస్తాయనుకోలేం. మరి దిల్ రాజు వారసులకు ఈ రెండో సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
This post was last modified on April 18, 2023 10:07 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…