తన సంస్థలో పెద్ద సినిమాలు నిర్మిస్తూ తాజాగా మరో చిన్న బేనర్ స్టార్ట్ చేశారు దిల్ రాజు. ‘డీ ఆర్ పీ’ అనే సంస్థను మొదలు పెట్టి ఆ భాద్యతలు తన కూతురు హన్షిత , అన్న కొడుకు హర్షిత్ లకు అప్పగించాడు. ఈ బేనర్ లో వచ్చిన మొదటి సినిమా ‘బలగం’ చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుంది. గొప్ప పేరుతో పాటు డబ్బు కూడా తెచ్చి పెట్టింది.
ఈ సినిమా తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ లో మరో సినిమా రెడీ అయింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశారు. డాన్స్ మాస్టర్ యశ్ ను హీరోగా, శశి అనే రైటర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా నిర్మిస్తున్నాడు దిల్ రాజు. రోడ్ జర్నీ తో సాగే ఎంటర్టైనింగ్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఓ మంచి డేట్ లాక్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.
అయితే బలగం దారిలోనే ఈ సినిమాను కూడా ముందు నుండి జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ముందుగా తన కొత్త బేనర్ కి బ్రాండ్ గా నిలిచిన బలగంను వాడుకొని ఆ సినిమాకు ఫ్రమ్ ది మేకర్స్ ఆఫ్ బలగం అనే ట్యాగ్ వేయనున్నారు. ఆ తర్వాత ప్రీమియర్ షోలు , వరుస ప్రెస్ మీట్లు పెట్టే ఆలోచనలో ఉన్నారు. అన్నీ బలగంలా అద్భుతాలు చేస్తాయనుకోలేం. మరి దిల్ రాజు వారసులకు ఈ రెండో సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
This post was last modified on April 18, 2023 10:07 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…