తన సంస్థలో పెద్ద సినిమాలు నిర్మిస్తూ తాజాగా మరో చిన్న బేనర్ స్టార్ట్ చేశారు దిల్ రాజు. ‘డీ ఆర్ పీ’ అనే సంస్థను మొదలు పెట్టి ఆ భాద్యతలు తన కూతురు హన్షిత , అన్న కొడుకు హర్షిత్ లకు అప్పగించాడు. ఈ బేనర్ లో వచ్చిన మొదటి సినిమా ‘బలగం’ చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుంది. గొప్ప పేరుతో పాటు డబ్బు కూడా తెచ్చి పెట్టింది.
ఈ సినిమా తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ లో మరో సినిమా రెడీ అయింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశారు. డాన్స్ మాస్టర్ యశ్ ను హీరోగా, శశి అనే రైటర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా నిర్మిస్తున్నాడు దిల్ రాజు. రోడ్ జర్నీ తో సాగే ఎంటర్టైనింగ్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఓ మంచి డేట్ లాక్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.
అయితే బలగం దారిలోనే ఈ సినిమాను కూడా ముందు నుండి జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ముందుగా తన కొత్త బేనర్ కి బ్రాండ్ గా నిలిచిన బలగంను వాడుకొని ఆ సినిమాకు ఫ్రమ్ ది మేకర్స్ ఆఫ్ బలగం అనే ట్యాగ్ వేయనున్నారు. ఆ తర్వాత ప్రీమియర్ షోలు , వరుస ప్రెస్ మీట్లు పెట్టే ఆలోచనలో ఉన్నారు. అన్నీ బలగంలా అద్భుతాలు చేస్తాయనుకోలేం. మరి దిల్ రాజు వారసులకు ఈ రెండో సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
This post was last modified on April 18, 2023 10:07 pm
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…