మూడు దశాబ్దాలకు చేరువగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ కూడా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్లో పాల్గొన్నది లేదు. ఒక సినిమా అయ్యాక చాలా గ్యాప్ తీసుకుని ఇంకో సినిమా చేసేవాడాయన. అలాంటిది మూడు నెలల వ్యవధిలో నాలుగో సినిమా చిత్రీకరణలో పాల్గొనడం.. ఒకే సమయంలో ఆయన సినిమాలు నాలుగు వివిధ దశల్లో ఉండటం అన్నది ఊహకైనా అందని విషయమే.
చాన్నాళ్ల పాటు షూటింగ్ ఆగిపోయి ఉన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాను గత ఏడాది చివర్లో తిరిగి సెట్స్ మీదికి తీసుకెళ్లాడు పవన్. కొన్ని వారాల పాటు విరామం లేకుండా ఈ సినిమా షూట్లో పాల్గొని భారీ యాక్షన్ ఎపిసోడ్లన్నింటినీ పూర్తి చేశాడు. ఇక ఫిబ్రవరి నెలాఖర్లో ‘వినోదియ సిత్తం’ రీమేక్ను పవన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అందులో తన పనంతా పూర్తి చేసి.. కొన్ని వారాల కిందటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
అందులో ఒక షెడ్యూల్ అయింది. ఇప్పుడేమో సుజీత్ డైరెక్షన్లో ‘ఓజీ’కి కూడా డేట్లు ఇచ్చేశాడు పవన్. మిగతా సినిమాలన్నీ కూడా చాన్నాళ్ల నుంచి వెయిటింగ్లో ఉన్నవి. కానీ ‘ఓజీ’ అనౌన్స్ చేసింది చాలా లేటుగా. ఒకేసారి ఇన్ని సినిమాల చిత్రీకరణ అంటే చాలా కష్టం కాబట్టి.. ఈ చిత్రాన్ని వాయిదా వేయిస్తాడేమో, ఎన్నికల తర్వాత చూసుకుంటాడేమో అని అభిమానులు అనుకున్నారు. కానీ వాళ్లకు షాకిస్తూ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టించేశాడు పవన్.
పవర్ స్టార్ షూట్కు హాజరవుతున్న విషయాన్ని వెల్లడిస్తూ.. ‘ఫైర్ స్టార్ కమింగ్’ అనే హ్యాష్ ట్యాగ్తో ఒక పోస్టు పెట్టింది నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్. పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో అభిమానులను బాగా ఎగ్జైట్ చేస్తున్న సినిమా కావడంతో వారి ఆనందం మామూలుగా లేదు. ఈ సినిమా షెడ్యూల్ ఒకటయ్యాక తిరిగి హరీష్ శంకర్ సినిమాలోకి వెళ్లనున్నాడు పవన్. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగే ముందు మూణ్నాలుగు నెలల్లో ఈ రెండు సినిమాలనూ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. కానీ ముందస్తు ఎన్నికలంటే మాత్రం ఈ సినిమాలు రెండూ పెండింగ్లో పడిపోవడం ఖాయం.
This post was last modified on April 18, 2023 2:11 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…