మూడు దశాబ్దాలకు చేరువగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ కూడా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్లో పాల్గొన్నది లేదు. ఒక సినిమా అయ్యాక చాలా గ్యాప్ తీసుకుని ఇంకో సినిమా చేసేవాడాయన. అలాంటిది మూడు నెలల వ్యవధిలో నాలుగో సినిమా చిత్రీకరణలో పాల్గొనడం.. ఒకే సమయంలో ఆయన సినిమాలు నాలుగు వివిధ దశల్లో ఉండటం అన్నది ఊహకైనా అందని విషయమే.
చాన్నాళ్ల పాటు షూటింగ్ ఆగిపోయి ఉన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాను గత ఏడాది చివర్లో తిరిగి సెట్స్ మీదికి తీసుకెళ్లాడు పవన్. కొన్ని వారాల పాటు విరామం లేకుండా ఈ సినిమా షూట్లో పాల్గొని భారీ యాక్షన్ ఎపిసోడ్లన్నింటినీ పూర్తి చేశాడు. ఇక ఫిబ్రవరి నెలాఖర్లో ‘వినోదియ సిత్తం’ రీమేక్ను పవన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అందులో తన పనంతా పూర్తి చేసి.. కొన్ని వారాల కిందటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
అందులో ఒక షెడ్యూల్ అయింది. ఇప్పుడేమో సుజీత్ డైరెక్షన్లో ‘ఓజీ’కి కూడా డేట్లు ఇచ్చేశాడు పవన్. మిగతా సినిమాలన్నీ కూడా చాన్నాళ్ల నుంచి వెయిటింగ్లో ఉన్నవి. కానీ ‘ఓజీ’ అనౌన్స్ చేసింది చాలా లేటుగా. ఒకేసారి ఇన్ని సినిమాల చిత్రీకరణ అంటే చాలా కష్టం కాబట్టి.. ఈ చిత్రాన్ని వాయిదా వేయిస్తాడేమో, ఎన్నికల తర్వాత చూసుకుంటాడేమో అని అభిమానులు అనుకున్నారు. కానీ వాళ్లకు షాకిస్తూ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టించేశాడు పవన్.
పవర్ స్టార్ షూట్కు హాజరవుతున్న విషయాన్ని వెల్లడిస్తూ.. ‘ఫైర్ స్టార్ కమింగ్’ అనే హ్యాష్ ట్యాగ్తో ఒక పోస్టు పెట్టింది నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్. పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో అభిమానులను బాగా ఎగ్జైట్ చేస్తున్న సినిమా కావడంతో వారి ఆనందం మామూలుగా లేదు. ఈ సినిమా షెడ్యూల్ ఒకటయ్యాక తిరిగి హరీష్ శంకర్ సినిమాలోకి వెళ్లనున్నాడు పవన్. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగే ముందు మూణ్నాలుగు నెలల్లో ఈ రెండు సినిమాలనూ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. కానీ ముందస్తు ఎన్నికలంటే మాత్రం ఈ సినిమాలు రెండూ పెండింగ్లో పడిపోవడం ఖాయం.
This post was last modified on April 18, 2023 2:11 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…