ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా ఒక స్థాయి అందుకోవడ అంటే చిన్న విషయం కాదు. కిరణ్ అబ్బవరం అనే కుర్రాడు ఇండస్ట్రీలోకి వచ్చి చాలా తక్కువ సమయంలోనూ యూత్లో కొంత ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించాడు. ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి చిన్న సినిమాతో అతను రాబట్టిన ఓపెనింగ్స్ చూసి ఇండస్ట్రీ జనాలు షాకయ్యారు. ఆ సినిమా డివైడ్ టాక్ను తట్టుకుని మంచి విజయం సాధించింది. ఈ ఊపు చూసి పేరున్న బేనర్లలో కిరణ్కు అవకాశాలు వచ్చాయి. అతడితో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద నిర్మాతలు ఆసక్తి చూపించారు.
గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బేనర్లలో అవకాశం దక్కడం అంటే చిన్న విషయం కాదు. కిరణ్కు దక్కిన ఆ అదృష్టం చూసి వేరే యంగ్ హీరోలు కుళ్లుకునే పరిస్థితి కనిపించింది. ఒక టైంలో కిరణ్ కొత్త సినిమాలకు డేట్లు సర్దుబాటు చేయలేని స్థితిలో ఉన్నాడు.
కానీ ఎంత వేగంగా ఫాలోయింగ్ సంపాదించాడో అంతే వేగంగా దాన్ని కోల్పోవడంతో ఇప్పుడు కిరణ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. గీతా బేనర్లో తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథకు కూడా అంత మంచి టాక్ రాకపోయినా అది బ్యాడ్ మూవీ అయితే కాదు. పైగా గీతా వారి మార్కెటింగ్ నైపుణ్యంతో అది బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరుగా ఆడేసింది. కానీ మైత్రీ లాంటి పెద్ద బేనర్లో కిరణ్ చేసిన మీటర్ దారుణంగా బోల్తా కొట్టడంతో కిరణ్ మీద ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఈ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ రాలేదు. ఈ దెబ్బతో ఇండస్ట్రీలో కిరణ్ మీద ఒపీనియనే మారిపోయింది.
ఇప్పటిదాకా తన కోసం వెంటపడ్డ నిర్మాతలు ఇప్పుడు సైడైపోతున్నారు. అతడి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ అంతా దెబ్బ తినేసిన పరిస్థితి కనిపిస్తుండటంతో ఇక కొత్త సినిమాలు రావడం కష్టం లాగే ఉంది. రూల్స్ రంజన్ సినిమాకు కూడా పెద్దగా బజ్ లేదు. ఈ సినిమా ఆడితే కిరణ్ కెరీర్ పుంజుకుంటుందేమో కానీ.. అది తేడా కొడితే మాత్రం చాలా కష్టమే.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…