పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఓవర్ డోస్ ఎగ్జైట్మెంట్తో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. పాతికేళ్లకు పైగా సాగిన కెరీర్లో పవన్ ఎన్నడూ చూపించని వేగం ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా సరే.. పవన్ ఒకేసారి సమాంతంగా రెండు సినిమాల్లో నటించింది లేదు. ఒక సినిమాకు ఇంకో సినిమాకు చాలా గ్యాప్ తీసుకునేవాడు. రెండేళ్లకు ఒక సినిమా రావడం కూడా గగనంగా ఉండేది.
మిగతా స్టార్ హీరోలు గ్యాప్ లేకుండా నటిస్తుంటే.. పవన్ మాత్రం తాపీగా సినిమాలు చేయడం వారికి రుచించేది కాదు. అందులోనూ రాజకీయాల్లోకి వచ్చాక పవన్ మరింత స్పీడు తగ్గించేశాడు. ఒక దశలో సినిమాలకు దూరం కూడా అయ్యాడు. మళ్లీ రీఎంట్రీ ఇచ్చాక కూడా కొంచెం నెమ్మదిగానే కనిపించాడు. కానీ ఈ మధ్య మాత్రం ఉన్నట్లుండి స్పీడు పెంచేశాడు. ఆ స్పీడు సూపర్ ఫాస్ట్ రేంజిలో ఉండటమే అభిమానులు ఉక్కిరిబిక్కిరి అయిపోతుండటానికి కారణం.
ఓవైపు చాన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం కొన్ని వారాల పాటు విరామం లేకుండా షూటింగ్కు హాజరై ముఖ్యమైన ఎపిసోడ్లు పూర్తి చేశాడు. తర్వాత కేవలం 20 రోజులు డేట్లు ఇచ్చి ‘వినోదియ సిత్తం’ రీమేక్లో తన పని మొత్తం అవగొట్టేశాడు. ఆ వెంటనే మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను కూడా పట్టాలెక్కించాడు. తొలి షెడ్యూల్ ఏ ఆటంకాలు లేకుండా పూర్తయ్యేలా చేశాడు. ఇంతలోనే సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ని మొదలుపెట్టేశాడు. హరీష్ శంకర్ అనగానే పవన్ అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. అతడితో మళ్లీ సినిమాను మొదలు పెట్టి ఒక షెడ్యూల్ పూర్తి చేయడం అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచుతోంది.
హరీష్ లాగే పవన్ అభిమానే అయిన సుజీత్ తీసే సినిమా విషయంలోనూ అభిమానులు చాలా అంచనాలున్నాయి. ఆ అంచనాలను పెంచేలా ఒక ఇంట్రెస్టింగ్ ప్రోమోతో సుజీత్ తన మార్కు చూపించాడు. ఇలా వరుసబెట్టి అప్డేట్లను, ఈ ఆనందాన్ని పవన్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారనే చెప్పాలి.
This post was last modified on April 17, 2023 6:15 am
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. సమావేశాలను వారు ప్రత్యక్షంగా…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…