కొన్ని కాంబినేషన్లు ప్రకటించిన టైంలో కొంత నెగటివిటీని మూటగట్టుకుంటాయి. వాటిని తగ్గించడానికి దర్శక నిర్మాతలు నానా పాట్లు పడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అనుకోకుండా జరిగే పరిణామాలు కలిసొస్తాయి. ప్రభాస్ మారుతీ కలయికలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి అలాగే జరుగుతోంది. అనౌన్స్ చేసినప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా సక్సెస్ లేని డైరెక్టర్ తో తమ హీరో చేయడమేంటని రుసరుసలాడారు. దానికి తగ్గట్టే మారుతీ గత చిత్రాలు పక్కా కమర్షియల్, మంచి రోజులు వచ్చాయి కనీస స్థాయిలో ఆడలేక ఫ్లాపయ్యాయి.
అందుకే ఈ కాంబో మీద అన్ని కామెంట్స్ వచ్చాయి. అయినా అదేమీ పట్టించుకోకుండా షూటింగ్ మొదలుపెట్టేశారు. ఆది పురుష్, సలార్ విడుదల ఈ ఏడాదే ఉన్న నేపథ్యంలో తమ చిత్రం తాలూకు అప్డేట్స్ బయటికి రాకుండా మారుతీ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకొంటోంది. అయినా కూడా పాట చిత్రీకరణ జరుగుతున్న టైంలో ప్రభాస్ తాలూకు లుక్ ఒకటి బయటికి లీకైపోయింది. అందులో అమ్మాయి కూడా ఉండి సరైన క్లారిటీ లేకపోయినా రిద్ది కుమారేనని మూవీ లవర్స్ గుర్తుపట్టేశారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడీ లీక్డ్ పిక్కే మారుతీకి ప్లస్ అవుతోంది. ప్రభాస్ చాలా స్టయిలిష్ లుక్ లో చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఆది పురుష్ లో గ్రాఫిక్ మిక్స్, సలార్ లో మొహమంతా మసిపూసిన మాస్ కలర్ లతో పోల్చుకుని చూస్తే ఈ ఫోటోలో ఒకప్పటి డార్లింగ్, మిర్చి ప్రభాస్ గుర్తొస్తున్నాడని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అపార్థం చేసుకున్నామంటూ ప్రత్యేకంగా థాంక్స్ చెబుతూ ట్వీట్లు పెడుతున్నారు. రాజా డీలక్స్ తో పాటు మరో రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్న కామెడీ కం హారర్ యాక్షన్ థ్రిల్లర్ ని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ప్రాజెక్ట్ కె వాయిదా పడితే ఇది సంక్రాంతికి రావొచ్చు.
This post was last modified on April 15, 2023 11:37 am
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…