నిన్న విడుదలైన శాకుంతలం మీద పూర్తిగా నెగటివ్ టాక్ నడుస్తోంది. త్రీడి హంగులు జోడించినా, నిర్మాతలు ప్రమోషన్ల హంగామా ఎంత చేసినా, నాలుగు రోజుల ముందే ప్రీమియర్లు వేసినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవలే హీరోయిన్ సమంత మీద సీనియర్ నటుడు కం నిర్మాత చిట్టిబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. చైతుతో విడాకులు అయ్యాక పుష్పలో ఐటెం సాంగ్ చేయడం కేవలం సంపాదన కోసమే అన్న ఆయన ఆమెకు హీరోయిన్ స్థాయి పడిపోవడం వల్లే ఏ ఆఫర్ వచ్చినా ఒప్పేసుకుని చేస్తోందని వ్యాఖ్యానించారు.
గతాన్ని వాడుకుని సానుభూతిని రాబట్టుకోవాలని చూస్తున్న సామ్ యశోద విడుదల సమయంలో ఇదే ఎత్తుగడ పాటించి హిట్టు కొట్టాలని చూసిందన్నారు. శాకుంతలం నిర్మాణం జరుగుతున్న సమయంలోనూ తాను చనిపోయేలోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పడం కేవలం సింపతీని కోరుకునే ప్రయత్నమని, ప్రతిసారి ఇలా ప్రేక్షకులను సెంటిమెంట్ తో టచ్ చేయాలని చూస్తే వర్కౌట్ కాదని, ఇదంతా డ్రామాని కొట్టిపారేస్తూ తేల్చి చెప్పడం షాకిచ్చే విషయం. ఇవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలే అయినప్పటికీ యశోద, శాకుంతలం ప్రీరిలీజ్ టైంలో పరిణామాలను నెటిజెన్ల లింక్ చేసి చూస్తున్నారు.
సరిగ్గా రిలీజ్ కు రెండు రోజులు ఉండగా జ్వరంతో ఈవెంట్లకు దూరమవుతున్నానని సమంతా ప్రకటించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి చిట్టిబాబు మాటలు చిన్నపాటి దుమారమే రేపాయి. శాకుంతలం మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సామ్ కు ఫలితం షాకిచ్చేలా ఉంది. అన్ని భాషల్లోనూ ఒకే స్పందన వచ్చినట్టు ట్రేడ్ టాక్. ఓపెనింగ్ ఫిగర్స్ భయపెట్టేలా ఉంటాయని అంటున్నారు. ఒకవేళ ఇది హిట్టయ్యుంటే ఎలా ఉండేదో కానీ అలా జరగకపోవడంతో ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఈ పరిణామాల పట్ల సామ్ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లేదు.
This post was last modified on April 15, 2023 10:58 am
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…