నిన్న విడుదలైన శాకుంతలం మీద పూర్తిగా నెగటివ్ టాక్ నడుస్తోంది. త్రీడి హంగులు జోడించినా, నిర్మాతలు ప్రమోషన్ల హంగామా ఎంత చేసినా, నాలుగు రోజుల ముందే ప్రీమియర్లు వేసినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవలే హీరోయిన్ సమంత మీద సీనియర్ నటుడు కం నిర్మాత చిట్టిబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. చైతుతో విడాకులు అయ్యాక పుష్పలో ఐటెం సాంగ్ చేయడం కేవలం సంపాదన కోసమే అన్న ఆయన ఆమెకు హీరోయిన్ స్థాయి పడిపోవడం వల్లే ఏ ఆఫర్ వచ్చినా ఒప్పేసుకుని చేస్తోందని వ్యాఖ్యానించారు.
గతాన్ని వాడుకుని సానుభూతిని రాబట్టుకోవాలని చూస్తున్న సామ్ యశోద విడుదల సమయంలో ఇదే ఎత్తుగడ పాటించి హిట్టు కొట్టాలని చూసిందన్నారు. శాకుంతలం నిర్మాణం జరుగుతున్న సమయంలోనూ తాను చనిపోయేలోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పడం కేవలం సింపతీని కోరుకునే ప్రయత్నమని, ప్రతిసారి ఇలా ప్రేక్షకులను సెంటిమెంట్ తో టచ్ చేయాలని చూస్తే వర్కౌట్ కాదని, ఇదంతా డ్రామాని కొట్టిపారేస్తూ తేల్చి చెప్పడం షాకిచ్చే విషయం. ఇవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలే అయినప్పటికీ యశోద, శాకుంతలం ప్రీరిలీజ్ టైంలో పరిణామాలను నెటిజెన్ల లింక్ చేసి చూస్తున్నారు.
సరిగ్గా రిలీజ్ కు రెండు రోజులు ఉండగా జ్వరంతో ఈవెంట్లకు దూరమవుతున్నానని సమంతా ప్రకటించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి చిట్టిబాబు మాటలు చిన్నపాటి దుమారమే రేపాయి. శాకుంతలం మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సామ్ కు ఫలితం షాకిచ్చేలా ఉంది. అన్ని భాషల్లోనూ ఒకే స్పందన వచ్చినట్టు ట్రేడ్ టాక్. ఓపెనింగ్ ఫిగర్స్ భయపెట్టేలా ఉంటాయని అంటున్నారు. ఒకవేళ ఇది హిట్టయ్యుంటే ఎలా ఉండేదో కానీ అలా జరగకపోవడంతో ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఈ పరిణామాల పట్ల సామ్ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లేదు.
This post was last modified on April 15, 2023 10:58 am
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…