సమంత మీద నిర్మాత సంచలన వ్యాఖ్యలు

నిన్న విడుదలైన శాకుంతలం మీద పూర్తిగా నెగటివ్ టాక్ నడుస్తోంది. త్రీడి హంగులు జోడించినా, నిర్మాతలు ప్రమోషన్ల హంగామా ఎంత చేసినా, నాలుగు రోజుల ముందే ప్రీమియర్లు వేసినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవలే హీరోయిన్ సమంత మీద సీనియర్ నటుడు కం నిర్మాత చిట్టిబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. చైతుతో విడాకులు అయ్యాక పుష్పలో ఐటెం సాంగ్ చేయడం కేవలం సంపాదన కోసమే అన్న ఆయన ఆమెకు హీరోయిన్ స్థాయి పడిపోవడం వల్లే ఏ ఆఫర్ వచ్చినా ఒప్పేసుకుని చేస్తోందని వ్యాఖ్యానించారు.

గతాన్ని వాడుకుని సానుభూతిని రాబట్టుకోవాలని చూస్తున్న సామ్ యశోద విడుదల సమయంలో ఇదే ఎత్తుగడ పాటించి హిట్టు కొట్టాలని చూసిందన్నారు. శాకుంతలం నిర్మాణం జరుగుతున్న సమయంలోనూ తాను చనిపోయేలోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పడం కేవలం సింపతీని కోరుకునే ప్రయత్నమని, ప్రతిసారి ఇలా ప్రేక్షకులను సెంటిమెంట్ తో టచ్ చేయాలని చూస్తే వర్కౌట్ కాదని, ఇదంతా డ్రామాని కొట్టిపారేస్తూ తేల్చి చెప్పడం షాకిచ్చే విషయం. ఇవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలే అయినప్పటికీ యశోద, శాకుంతలం ప్రీరిలీజ్ టైంలో పరిణామాలను నెటిజెన్ల లింక్ చేసి చూస్తున్నారు.

సరిగ్గా రిలీజ్ కు రెండు రోజులు ఉండగా జ్వరంతో ఈవెంట్లకు దూరమవుతున్నానని సమంతా ప్రకటించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి చిట్టిబాబు మాటలు చిన్నపాటి దుమారమే రేపాయి. శాకుంతలం మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సామ్ కు ఫలితం షాకిచ్చేలా ఉంది. అన్ని భాషల్లోనూ ఒకే స్పందన వచ్చినట్టు ట్రేడ్ టాక్. ఓపెనింగ్ ఫిగర్స్ భయపెట్టేలా ఉంటాయని అంటున్నారు. ఒకవేళ ఇది హిట్టయ్యుంటే ఎలా ఉండేదో కానీ అలా జరగకపోవడంతో ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఈ పరిణామాల పట్ల సామ్ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లేదు.