కెజిఎఫ్ తర్వాత యష్ నటించబోయే సినిమా ఏదనే ఆసక్తి కన్నడ ప్రేక్షకుల్లోనే కాదు ఇతర రాష్ట్రాల ఆడియన్స్ లోనూ ఉంది. రాఖీ భాయ్ ఎలాంటి కథలో కనిపిస్తాడోనని ఎదురు చూస్తున్నారు. ఏడాది గడిచినా ఇంకా కొత్త ప్రాజెక్టుని లాక్ చేయకపోవడం పట్ల పలు అనుమానాలు తలెత్తాయి. తాజాగా మలయాళం లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త హాట్ టాపిక్ గా మారింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ప్యాన్ ఇండియా రేంజ్ లో దీన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి.
గీతూ మోహన్ దాస్ ప్రత్యేకత ఏంటనేగా మీ డౌట్. ఆవిడ అసలు పేరు గాయత్రి దాస్. మల్లువుడ్ లో ప్రముఖ నటి. 1986లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి మొదటి చిత్రం ఒన్ను ముత్తల్ పూజయం వరేతో కేరళ స్టేట్ అవార్డు కొట్టేసింది. హీరోయిన్ గా చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. 2009లో స్వంతంగా ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టి చిన్న షార్ట్ ఫిలిం ఒకటి తీస్తే అది ఏకంగా మూడు ఇంటర్నేషనల్ పురస్కారాలు తీసుకొచ్చింది. 12వ తరగతి పాఠ్య పుస్తకంలో ఈ మూవీని ఒక లెసన్ గా పొందుపరిచారు. 2014లో లయర్స్ డైస్ అనే హిందీ చిత్రాన్ని పూర్తి స్థాయి నిడివితో చేస్తే దానికి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. 2019లో తీసిన మూతోన్ పెద్ద విజయం సాధించింది. దీని తెలుగు డబ్ ఓటిటిలో ఉంది.
వినడానికి అనుభవం తక్కువగా అనిపించినా అంతర్జాతీయ స్థాయిలో గీతూ మోహన్ దాస్ సాధించిన ఘనతలు చాలా పెద్దవి. అయితే సంవత్సరం పైగా కాలం ఆవిడతో పాటు యష్ కథకు సంబందించిన తీవ్ర చర్చల్లో ఉన్నారట. ఫైనల్ వెర్షన్ సంతృప్తికరంగా అనిపించాక అనౌన్స్ మెంట్ ఇచ్చే ప్లానింగ్ తో ఉన్నారు. ఎందరో స్టార్ డైరెక్టర్లు వెంట పడగా నో చెప్పిన యష్ ఇలా మహిళా దర్శకురాలితో చేసేందుకు సానుకూలంగా ఉండటం ఆశ్చర్యమే. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కాబట్టి వీలైనంత త్వరగా మొదలుపెట్టమని ఫ్యాన్స్ డిమాండ్.
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…