Movie News

కెజిఎఫ్ 2 వచ్చి ఏడాది దాటింది కానీ

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఏప్రిల్ 14న విడుదలైన కెజిఎఫ్ చాఫ్టర్ 2 సృష్టించిన వసూళ్ల సునామిని ఇండియన్ బాక్సాఫీస్ అంత సులభంగా మర్చిపోలేదు. ఒక శాండల్ వుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల కోట్లు వసూలు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. భాషతో సంబంధం లేకుండా అన్నిచోట్ల రాఖీ భాయ్ సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. నాలుగేళ్ల క్రితం కర్ణాటక దాటి బయట ఎవరికీ తెలియని హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ మోస్ట్ వాంటెడ్ లిస్టులోకి చేరిపోయారు. మొదటి యానివర్సరి వచ్చినా ఫ్యాన్స్ మాత్రం ఆనందంగా లేరు.

ఎందుకంటే యష్ కొత్త సినిమా ఇంకా ఫైనల్ కాలేదు. దర్శకులు వస్తున్నారు కథలు చెబుతున్నారు తప్ప ఏదీ తేల్చుకోలేకపోతున్నాడు. నర్తన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఆ మధ్య టాక్ వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత అతను శివరాజ్ కుమార్ తో మఫ్టీ సీక్వెల్ కు వెళ్ళిపోయాడు. రామ్ చరణ్ కి సైతం ఒక లైన్ తో మెప్పించి స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో పడ్డాడు. లైగర్ షూటింగ్ టైంలో పూరి జగన్నాధ్ తో జరిపిన చర్చలు ఆ తర్వాత దాని ఫలితం చూశాక ముందుకెళ్లలేకపోయాయి. దీంతో యష్ ఎంత ఆలస్యమైనా సరే తొందరపడే సమస్యే లేదంటున్నాడు.

పోనీ కెజిఎఫ్ 3 ఉందా అంటే అదంత సులభంగా జరిగే వ్యవహారంలా లేదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సలార్ నుంచి బయటికి రావడానికి సెప్టెంబర్ దాటేస్తుంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ మీద పని చేయాలి. ఎంతలేదన్నా ఇదయ్యేలోపు 2025 వచ్చేస్తుంది. సో ఛాన్స్ లేనట్టే. యష్ మనసులో ఏముందో మీడియాకు అంతుచిక్కడం లేదు. ఆ మధ్య పుట్టినరోజుకు ఏమైనా అనౌన్స్ మెంట్ చేస్తాడేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ అది జరగలేదు. ఇప్పుడు కెజిఎఫ్ వార్షికోత్సవం వచ్చినా సరే ఇప్పుడప్పుడే కదలిక వచ్చే సూచనలైతే దగ్గర్లో కనిపించడం లేదు

This post was last modified on April 14, 2023 11:05 am

Share
Show comments
Published by
satya

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

3 hours ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

6 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

6 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

7 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

8 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

8 hours ago