సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఏప్రిల్ 14న విడుదలైన కెజిఎఫ్ చాఫ్టర్ 2 సృష్టించిన వసూళ్ల సునామిని ఇండియన్ బాక్సాఫీస్ అంత సులభంగా మర్చిపోలేదు. ఒక శాండల్ వుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల కోట్లు వసూలు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. భాషతో సంబంధం లేకుండా అన్నిచోట్ల రాఖీ భాయ్ సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. నాలుగేళ్ల క్రితం కర్ణాటక దాటి బయట ఎవరికీ తెలియని హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ మోస్ట్ వాంటెడ్ లిస్టులోకి చేరిపోయారు. మొదటి యానివర్సరి వచ్చినా ఫ్యాన్స్ మాత్రం ఆనందంగా లేరు.
ఎందుకంటే యష్ కొత్త సినిమా ఇంకా ఫైనల్ కాలేదు. దర్శకులు వస్తున్నారు కథలు చెబుతున్నారు తప్ప ఏదీ తేల్చుకోలేకపోతున్నాడు. నర్తన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఆ మధ్య టాక్ వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత అతను శివరాజ్ కుమార్ తో మఫ్టీ సీక్వెల్ కు వెళ్ళిపోయాడు. రామ్ చరణ్ కి సైతం ఒక లైన్ తో మెప్పించి స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో పడ్డాడు. లైగర్ షూటింగ్ టైంలో పూరి జగన్నాధ్ తో జరిపిన చర్చలు ఆ తర్వాత దాని ఫలితం చూశాక ముందుకెళ్లలేకపోయాయి. దీంతో యష్ ఎంత ఆలస్యమైనా సరే తొందరపడే సమస్యే లేదంటున్నాడు.
పోనీ కెజిఎఫ్ 3 ఉందా అంటే అదంత సులభంగా జరిగే వ్యవహారంలా లేదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సలార్ నుంచి బయటికి రావడానికి సెప్టెంబర్ దాటేస్తుంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ మీద పని చేయాలి. ఎంతలేదన్నా ఇదయ్యేలోపు 2025 వచ్చేస్తుంది. సో ఛాన్స్ లేనట్టే. యష్ మనసులో ఏముందో మీడియాకు అంతుచిక్కడం లేదు. ఆ మధ్య పుట్టినరోజుకు ఏమైనా అనౌన్స్ మెంట్ చేస్తాడేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ అది జరగలేదు. ఇప్పుడు కెజిఎఫ్ వార్షికోత్సవం వచ్చినా సరే ఇప్పుడప్పుడే కదలిక వచ్చే సూచనలైతే దగ్గర్లో కనిపించడం లేదు
This post was last modified on April 14, 2023 11:05 am
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…