ఒకప్పుడు తమపై జరిగే లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయ్యే మహిళలు చాలా తక్కువగా కనిపించేవారు. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా నోరు విప్పేవాళ్లు కాదు. కానీ ‘మీ టూ’ ఉద్యమం తర్వాత ఎంతోమంది మౌనం వీడారు. సినీ పరిశ్రమలోనే కాక వివిధ రంగాల్లో తమపై జరిగిన అఘాయిత్యాలు.. ఎదురైన లైంగిక వేధింపుల గురించి మహిళలు గళం విప్పారు. ఇంకా ఓపెన్ అవుతూనే ఉన్నారు.
మలయాళ యువ నటి మాళవిక శ్రీనాథ్ తాజాగా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి మాలీవుడ్లో. మంజు వారియర్ కీలక పాత్ర పోషించిన ఓ సినిమాలో ఆమె కూతురి పాత్ర కోసం ఆడిషన్కు పిలిచి తనపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మాళవిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తనకు ఆడిషన్ ఏర్పాటు చేసిన వ్యక్తే తనపై అఘాయిత్యానికి ప్రయత్నించాడని మాళవివక తెలిపింది. ఆడిషన్ జరుగుతున్న సమయంలో తన తల్లి, సోదరి ఆ గది బయటే ఉన్నారని.. ఐతే లోపల తనతో ఆడిషన్ చేసిన వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని మాళవిక చెప్పింది. తన జుట్టు సరిగా లేదని చెప్పి ఒక గదిలోపలికి పంపించిన ఆ వ్యక్తి.. ఉన్నట్లుండి వచ్చి వెనుక నుంచి తనను వాటేసుకున్నాడని ఆమె వెల్లడించింది. తాను విడిపించుకునే ప్రయత్నం చేయగా.. కొంచెం సర్దుకుపోతే మంజు వారియర్ కూతురి పాత్ర తనకే దక్కుతుందని చెప్పాడని.. కానీ తాను ఆ వ్యక్తి నుంచి తప్పించుకునేందుకు గట్టిగా ప్రయత్నించానని.. ఈ క్రమంలో అక్కడుకున్న కెమెరా కింద పడటం.. అతను దాని మీదికి దృష్టి మళ్లించడంతో అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డానని.. ఈ అనుభవం తనను తీవ్రంగా భయపెట్టిందని ఆమె చెప్పింది.
This post was last modified on April 13, 2023 9:18 am
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…