తమిళంలో చాలా తక్కువ సినిమాలతో గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు వెట్రిమారన్. తన తొలి చిత్రం పొల్లాదవన్ మొదలుకుని.. లేటెస్ట్గా రిలీజైన విడుదలై వరకు అన్నీ కల్ట్ మూవీసే. విడుదలై సినిమా తెలుగులో ఈ వారమే విడుదల కానున్న నేపథ్యంలో వెట్రిమారన్ హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.
ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్తో సినిమా చేసే విషయమై జోరుగా జరుగుతున్న ప్రచారంపై ఎదురైన ప్రశ్నకు వెట్రిమారన్ సమాధానం ఇచ్చాడు. తెలుగులో వేరే హీరోలతో జట్టు కట్టే విషయమై కూడా అతను మాట్లాడాడు.
ధనుష్తో తాను తీసిన అసురన్ రిలీజయ్యాక.. కరోనా-లాక్ డౌన్ అనంతరం ఎన్టీఆర్ను తాను కలిసినట్లు వెట్రిమారన్ చెప్పాడు. తమ మధ్య కథా చర్చలు జరిగాయని.. కానీ ఇంకా ఏదీ మెటీరియలైజ్ కాలేదని వెట్రిమారన్ తెలిపాడు. చర్చలు ప్రస్తుతానికి కొనసాగుతున్నాయని.. తాను సినిమా పూర్తి చేయడానికి.. ఇంకో సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకుంటానని.. కాబట్టి ఏదీ ఓకే అయ్యే వరకు ధ్రువీకరించలేనని వెట్రిమారన్ తెలిపాడు. తాను ఆడుగళం తర్వాత అల్లు అర్జున్ను కలిసి వడ చెన్నై కథ చెప్పానని.. కానీ బన్నీతో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదని వెట్రిమారన్ చెప్పాడు. ఈ సినిమాను తర్వాత వెట్రి.. ధనుష్తోనే తీసిన సంగతి తెలిసిందే. అలాగే మహేష్ బాబును కూడా కలిసి ఒక కథ గురించి చర్చించానని.. కానీ అది కూడా సెట్ కాలేదని చెప్పాడు.
ఎప్పుడు అన్నది తెలియదు కానీ.. తెలుగులో కచ్చితంగా తన సినిమా ఉంటుందని.. ఎన్టీఆర్తోనే సినిమా ఉండొచ్చనే సంకేతాలను వెట్రిమారన్ ఇచ్చాడు. ఐతే తారక్తో సినిమా చేసినా.. సినిమా తన స్టయిల్లోనే ఉంటుందని వెట్రిమారన్ సంకేతాలిచ్చాడు. తన కథకు తారక్ లాంటి స్టార్ అవసరం అనుకునేలాగే ఆ కథ ఉంటుందని చెప్పడం ద్వారా తన మార్కు హార్డ్ హిట్టింగ్ సినిమానే చేస్తానని వెట్రిమారన్ చెప్పకనే చెప్పాడు.
This post was last modified on April 12, 2023 6:15 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…