తమిళంలో చాలా తక్కువ సినిమాలతో గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు వెట్రిమారన్. తన తొలి చిత్రం పొల్లాదవన్ మొదలుకుని.. లేటెస్ట్గా రిలీజైన విడుదలై వరకు అన్నీ కల్ట్ మూవీసే. విడుదలై సినిమా తెలుగులో ఈ వారమే విడుదల కానున్న నేపథ్యంలో వెట్రిమారన్ హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.
ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్తో సినిమా చేసే విషయమై జోరుగా జరుగుతున్న ప్రచారంపై ఎదురైన ప్రశ్నకు వెట్రిమారన్ సమాధానం ఇచ్చాడు. తెలుగులో వేరే హీరోలతో జట్టు కట్టే విషయమై కూడా అతను మాట్లాడాడు.
ధనుష్తో తాను తీసిన అసురన్ రిలీజయ్యాక.. కరోనా-లాక్ డౌన్ అనంతరం ఎన్టీఆర్ను తాను కలిసినట్లు వెట్రిమారన్ చెప్పాడు. తమ మధ్య కథా చర్చలు జరిగాయని.. కానీ ఇంకా ఏదీ మెటీరియలైజ్ కాలేదని వెట్రిమారన్ తెలిపాడు. చర్చలు ప్రస్తుతానికి కొనసాగుతున్నాయని.. తాను సినిమా పూర్తి చేయడానికి.. ఇంకో సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకుంటానని.. కాబట్టి ఏదీ ఓకే అయ్యే వరకు ధ్రువీకరించలేనని వెట్రిమారన్ తెలిపాడు. తాను ఆడుగళం తర్వాత అల్లు అర్జున్ను కలిసి వడ చెన్నై కథ చెప్పానని.. కానీ బన్నీతో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదని వెట్రిమారన్ చెప్పాడు. ఈ సినిమాను తర్వాత వెట్రి.. ధనుష్తోనే తీసిన సంగతి తెలిసిందే. అలాగే మహేష్ బాబును కూడా కలిసి ఒక కథ గురించి చర్చించానని.. కానీ అది కూడా సెట్ కాలేదని చెప్పాడు.
ఎప్పుడు అన్నది తెలియదు కానీ.. తెలుగులో కచ్చితంగా తన సినిమా ఉంటుందని.. ఎన్టీఆర్తోనే సినిమా ఉండొచ్చనే సంకేతాలను వెట్రిమారన్ ఇచ్చాడు. ఐతే తారక్తో సినిమా చేసినా.. సినిమా తన స్టయిల్లోనే ఉంటుందని వెట్రిమారన్ సంకేతాలిచ్చాడు. తన కథకు తారక్ లాంటి స్టార్ అవసరం అనుకునేలాగే ఆ కథ ఉంటుందని చెప్పడం ద్వారా తన మార్కు హార్డ్ హిట్టింగ్ సినిమానే చేస్తానని వెట్రిమారన్ చెప్పకనే చెప్పాడు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…