తమిళంలో చాలా తక్కువ సినిమాలతో గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు వెట్రిమారన్. తన తొలి చిత్రం పొల్లాదవన్ మొదలుకుని.. లేటెస్ట్గా రిలీజైన విడుదలై వరకు అన్నీ కల్ట్ మూవీసే. విడుదలై సినిమా తెలుగులో ఈ వారమే విడుదల కానున్న నేపథ్యంలో వెట్రిమారన్ హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.
ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్తో సినిమా చేసే విషయమై జోరుగా జరుగుతున్న ప్రచారంపై ఎదురైన ప్రశ్నకు వెట్రిమారన్ సమాధానం ఇచ్చాడు. తెలుగులో వేరే హీరోలతో జట్టు కట్టే విషయమై కూడా అతను మాట్లాడాడు.
ధనుష్తో తాను తీసిన అసురన్ రిలీజయ్యాక.. కరోనా-లాక్ డౌన్ అనంతరం ఎన్టీఆర్ను తాను కలిసినట్లు వెట్రిమారన్ చెప్పాడు. తమ మధ్య కథా చర్చలు జరిగాయని.. కానీ ఇంకా ఏదీ మెటీరియలైజ్ కాలేదని వెట్రిమారన్ తెలిపాడు. చర్చలు ప్రస్తుతానికి కొనసాగుతున్నాయని.. తాను సినిమా పూర్తి చేయడానికి.. ఇంకో సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకుంటానని.. కాబట్టి ఏదీ ఓకే అయ్యే వరకు ధ్రువీకరించలేనని వెట్రిమారన్ తెలిపాడు. తాను ఆడుగళం తర్వాత అల్లు అర్జున్ను కలిసి వడ చెన్నై కథ చెప్పానని.. కానీ బన్నీతో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదని వెట్రిమారన్ చెప్పాడు. ఈ సినిమాను తర్వాత వెట్రి.. ధనుష్తోనే తీసిన సంగతి తెలిసిందే. అలాగే మహేష్ బాబును కూడా కలిసి ఒక కథ గురించి చర్చించానని.. కానీ అది కూడా సెట్ కాలేదని చెప్పాడు.
ఎప్పుడు అన్నది తెలియదు కానీ.. తెలుగులో కచ్చితంగా తన సినిమా ఉంటుందని.. ఎన్టీఆర్తోనే సినిమా ఉండొచ్చనే సంకేతాలను వెట్రిమారన్ ఇచ్చాడు. ఐతే తారక్తో సినిమా చేసినా.. సినిమా తన స్టయిల్లోనే ఉంటుందని వెట్రిమారన్ సంకేతాలిచ్చాడు. తన కథకు తారక్ లాంటి స్టార్ అవసరం అనుకునేలాగే ఆ కథ ఉంటుందని చెప్పడం ద్వారా తన మార్కు హార్డ్ హిట్టింగ్ సినిమానే చేస్తానని వెట్రిమారన్ చెప్పకనే చెప్పాడు.
This post was last modified on April 12, 2023 6:15 am
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…