తమిళంలో చాలా తక్కువ సినిమాలతో గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు వెట్రిమారన్. తన తొలి చిత్రం పొల్లాదవన్ మొదలుకుని.. లేటెస్ట్గా రిలీజైన విడుదలై వరకు అన్నీ కల్ట్ మూవీసే. విడుదలై సినిమా తెలుగులో ఈ వారమే విడుదల కానున్న నేపథ్యంలో వెట్రిమారన్ హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.
ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్తో సినిమా చేసే విషయమై జోరుగా జరుగుతున్న ప్రచారంపై ఎదురైన ప్రశ్నకు వెట్రిమారన్ సమాధానం ఇచ్చాడు. తెలుగులో వేరే హీరోలతో జట్టు కట్టే విషయమై కూడా అతను మాట్లాడాడు.
ధనుష్తో తాను తీసిన అసురన్ రిలీజయ్యాక.. కరోనా-లాక్ డౌన్ అనంతరం ఎన్టీఆర్ను తాను కలిసినట్లు వెట్రిమారన్ చెప్పాడు. తమ మధ్య కథా చర్చలు జరిగాయని.. కానీ ఇంకా ఏదీ మెటీరియలైజ్ కాలేదని వెట్రిమారన్ తెలిపాడు. చర్చలు ప్రస్తుతానికి కొనసాగుతున్నాయని.. తాను సినిమా పూర్తి చేయడానికి.. ఇంకో సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకుంటానని.. కాబట్టి ఏదీ ఓకే అయ్యే వరకు ధ్రువీకరించలేనని వెట్రిమారన్ తెలిపాడు. తాను ఆడుగళం తర్వాత అల్లు అర్జున్ను కలిసి వడ చెన్నై కథ చెప్పానని.. కానీ బన్నీతో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదని వెట్రిమారన్ చెప్పాడు. ఈ సినిమాను తర్వాత వెట్రి.. ధనుష్తోనే తీసిన సంగతి తెలిసిందే. అలాగే మహేష్ బాబును కూడా కలిసి ఒక కథ గురించి చర్చించానని.. కానీ అది కూడా సెట్ కాలేదని చెప్పాడు.
ఎప్పుడు అన్నది తెలియదు కానీ.. తెలుగులో కచ్చితంగా తన సినిమా ఉంటుందని.. ఎన్టీఆర్తోనే సినిమా ఉండొచ్చనే సంకేతాలను వెట్రిమారన్ ఇచ్చాడు. ఐతే తారక్తో సినిమా చేసినా.. సినిమా తన స్టయిల్లోనే ఉంటుందని వెట్రిమారన్ సంకేతాలిచ్చాడు. తన కథకు తారక్ లాంటి స్టార్ అవసరం అనుకునేలాగే ఆ కథ ఉంటుందని చెప్పడం ద్వారా తన మార్కు హార్డ్ హిట్టింగ్ సినిమానే చేస్తానని వెట్రిమారన్ చెప్పకనే చెప్పాడు.
This post was last modified on April 12, 2023 6:15 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…