బాక్సాఫీస్ వద్ద నాన్ స్టాప్ గా దూసుకుపోతున్న దసరా యుఎస్ లో సగర్వంగా 2 మిలియన్ మార్కుని నిన్నటితో దాటేసింది. కెరీర్ లో ఇప్పటికే ఏడు వన్ మిలియన్ సినిమాలు పెట్టుకున్న నానికి ఇది మొదటి డబుల్ ధమాకా. అయితే ఇందులో ప్రత్యేకత అది కాదు. విజయ్ దేవరకొండతో సహా ఇతర హీరోలు ఈ ఘనతను అందుకున్నారు. నాని స్పెషల్ ఏంటంటే ఒక డెబ్యూ డైరెక్టర్ తో ఈ మేజిక్ ఫిగర్ ని సాధించడం. ఇప్పటిదాకా ఎవరూ అలా చేయలేకపోయారు. అది కూడా నేటివిటీ మీద ఆధారపడ్డ ఒక పక్కా పల్లెటూరి రివెంజ్ డ్రామాతో అందుకోవడం చిన్న విషయం కాదు.
శ్రీకాంత్ ఓదెల ఈ దెబ్బకు ఒక అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నారు. తొలి చిత్రం సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు అందుకోవడం కొత్తేమి కాదు కానీ ఇలా ఓవర్సీస్ లో రికార్డుని సెట్ చేయడం మాత్రం ప్రత్యేకమే. ఇప్పటిదాకా 105 కోట్ల గ్రాస్ ని దాటేసిన దసరా షేర్ రూపంలో 60 కోట్లను నమోదు చేసింది. ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగుతోంది. మొన్న ఆదివారం చాలా చోట్ల తాజాగా రిలీజైన రవితేజ రావణాసుర కంటే దసరాకే ఎక్కువ వసూళ్లు రావడం బట్టి చూస్తే ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయస్ నానినే అవుతున్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ వీకెండ్ ఎలా వాడుకుంటాడనేది శాకుంతలం, రుద్రుడు, విడుదల పార్ట్ 1 ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. వీటిలో రెండు డబ్బింగ్ సినిమాలు కాబట్టి సమంత గుణశేఖర్ లు కనక కంటెంట్ తో మెప్పిస్తే దసరాకు కొంత బ్రేక్ తప్పదు. లేదూ అలా జరగలేదంటే మాత్రం ధరణి మళ్ళీ ఊచకోత మొదలుపెడతాడు. ఫైనల్ రన్ ఇప్పట్లో ఉండకపోవచ్చు. సులభంగా ఇంకో రెండు మూడు వారాలు స్టడీగా ఉండబోయే నేపథ్యంలో బయ్యర్లు అధిక శాతం థియేటర్లలో కొనసాగించే ఆలోచనలోనే ఉన్నారు. మొత్తానికి నాని అనుకున్న ఫీట్ పెద్ద మోతాదులో సాధించేశాడు.
This post was last modified on April 11, 2023 8:41 am
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…