ఒకప్పుడు సఖి లాంటి సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న మాధవన్ ఇటీవలి కాలంలో వైవిధ్యానికి పెద్ద పీఠవేస్తూ స్వీయ దర్శకత్వంతో పాటు మంచి వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. గత ఏడాది రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ తో గొప్ప చిత్రాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని డైరెక్టర్ గానూ శభాష్ అనిపించుకున్నాడు. నిజ జీవితపు రాకెట్ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథను చూపించిన తీరు అద్భుతంగా వచ్చింది. ఇది నచ్చే షారుఖ్ ఖాన్, సూర్య లాంటి స్టార్ హీరోలు దీంట్లో చిన్న క్యామియో చేశారు.
దీని స్ఫూర్తితోనే మాధవన్ మరో విజేత కథను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈసారి నటనకు మాత్రమే పరిమితం కాబోతున్నాడు. భారతదేశపు ఎడిసన్ అఫ్ ఇండియాగా పేరొందిన జీడీ నాయుడు బయోపిక్ లో టైటిల్ రోల్ తనదే. కృష్ణ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఉంటుంది. నాయుడుగారి పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు. స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు. మన దేశంలో మొదటి ఎలెక్ట్రిక్ మోటార్ కనిపెట్టింది ఈయనే. ఈ రంగంలో ఎన్నో అద్భుత ప్రయోగాలతో గొప్ప పేరుతో పాటు లెక్కలేనన్ని అవార్డులు పురస్కారాలు అందుకున్నారు.
నిజానికి ఈయన గురించి ఇప్పటి తరానికి తెలిసింది చాలా తక్కువే. ఎలాగూ కుర్రకారుకు పుస్తకాలు చదవడం మీద పెద్దగా ఆసక్తి లేదు. అందుకే ఇలాంటి మహనీయుల జీవితాలను సినిమా రూపంలో అందిస్తే కోట్లాది ప్రేక్షకులకు చేరుతుంది. కథల కరువుతో ఒకరకమైన మూస హీరోయిజంతో కొట్టుమిట్టాడుతున్న ట్రెండ్ లో ఇలాంటివి స్వచ్ఛమైన గాలి పీలుస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. అందరికీ ఎక్స్ పరిమెంట్లు చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి మాధవన్ చేస్తున్న ప్రయత్నాలు మెచ్చదగివవి. షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. ప్రస్తుతం క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి.
This post was last modified on April 10, 2023 2:47 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…