ఒకప్పుడు సఖి లాంటి సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న మాధవన్ ఇటీవలి కాలంలో వైవిధ్యానికి పెద్ద పీఠవేస్తూ స్వీయ దర్శకత్వంతో పాటు మంచి వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. గత ఏడాది రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ తో గొప్ప చిత్రాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని డైరెక్టర్ గానూ శభాష్ అనిపించుకున్నాడు. నిజ జీవితపు రాకెట్ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథను చూపించిన తీరు అద్భుతంగా వచ్చింది. ఇది నచ్చే షారుఖ్ ఖాన్, సూర్య లాంటి స్టార్ హీరోలు దీంట్లో చిన్న క్యామియో చేశారు.
దీని స్ఫూర్తితోనే మాధవన్ మరో విజేత కథను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈసారి నటనకు మాత్రమే పరిమితం కాబోతున్నాడు. భారతదేశపు ఎడిసన్ అఫ్ ఇండియాగా పేరొందిన జీడీ నాయుడు బయోపిక్ లో టైటిల్ రోల్ తనదే. కృష్ణ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఉంటుంది. నాయుడుగారి పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు. స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు. మన దేశంలో మొదటి ఎలెక్ట్రిక్ మోటార్ కనిపెట్టింది ఈయనే. ఈ రంగంలో ఎన్నో అద్భుత ప్రయోగాలతో గొప్ప పేరుతో పాటు లెక్కలేనన్ని అవార్డులు పురస్కారాలు అందుకున్నారు.
నిజానికి ఈయన గురించి ఇప్పటి తరానికి తెలిసింది చాలా తక్కువే. ఎలాగూ కుర్రకారుకు పుస్తకాలు చదవడం మీద పెద్దగా ఆసక్తి లేదు. అందుకే ఇలాంటి మహనీయుల జీవితాలను సినిమా రూపంలో అందిస్తే కోట్లాది ప్రేక్షకులకు చేరుతుంది. కథల కరువుతో ఒకరకమైన మూస హీరోయిజంతో కొట్టుమిట్టాడుతున్న ట్రెండ్ లో ఇలాంటివి స్వచ్ఛమైన గాలి పీలుస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. అందరికీ ఎక్స్ పరిమెంట్లు చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి మాధవన్ చేస్తున్న ప్రయత్నాలు మెచ్చదగివవి. షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. ప్రస్తుతం క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి.
This post was last modified on April 10, 2023 2:47 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…