ఈ మధ్య బాలీవుడ్ హీరోలు, ఫిలి మేకర్స్కు సౌత్ వైపు దారి మళ్లుతోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో ఇక్కడి మార్కెట్ మీద దృష్టిపెడుతున్నారు. సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆకర్షణలు జోడిస్తున్నారు. దక్షిణాది సినిమాలు తమ మార్కెట్ను కొల్లగొట్టేస్తున్న నేపథ్యంలో.. తాము కూడా సౌత్లో విస్తరించాలన్న ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు.
తాజాగా సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’కు ఇచ్చిన తెలుగు టచ్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక క్యామియో రోల్ చేయగా.. ఆయనతో పాటుగా రామ్ చరణ్ ఒక పాటలో మెరిశాడు. ఆ పాట ప్రోమో కూడా ఇటీవలే రిలీజై అందరినీ ఆకట్టుకుంది. దీని కంటే ముందు తెలంగాణలో ప్రధాన పండుగ అయిన బతుకమ్మ నేపథ్యంలో ఒక పాట కూడా పెట్టారు సినిమాలో. పూర్తిగా తెలుగులోనే ఆ పాట సాగడం విశేషం.
తెలుగు సినిమాల్లో హిందీ పాటలు చూశాం కానీ.. హిందీ సినిమాలో తెలుగు పాట అన్నది ఊహకైనా అందని విషయం. ఐతే సినిమాకు ఇలా తెలుగు టచ్ ఇవ్వడం.. వెంకీ, చరణ్లతో క్యామియోలు చేయించడం ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సినిమాలో కూడా ఇందుకు తగ్గ సందర్భం బాగానే కుదిరింది. ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’.. తమిళ చిత్రం ‘వీరం’కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం తెలుగులో ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ అయింది కూడా. ఇందులో అమ్మాయిలంటే అస్సలు పడని హీరోను.. అతడి సోదరులు ఒక అమ్మాయితో ప్రేమలో పడేలా చేస్తారు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను మెప్పించేందుకు హీరో, అతడి సోదరులంతా కలిసి ఆమె ఊరికి వెళ్లి తన ఇంట్లోనే ఉంటారు. తామంటే అస్సలు పడని హీరోయిన్ తండ్రిని హీరో, అతడి సోదరులు కలిసి ఇంప్రెస్ చేయడమే ఇక్కడ టాస్క్.
హిందీలో ముంబయి నేపథ్యంగా కథ నడిచి.. హీరోయిన్ ఇంటి సెటప్ను తెలంగాణలోని ఒక పల్లెటూరికి మార్చినట్లు తెలుస్తోంది. ఒరిజినల్లో హీరోయిన్కు తండ్రి బదులు రీమేక్లో హీరోయిన్కు సోదరుడి పాత్ర పెట్టారు. ఆ పాత్రనే వెంకీ చేసినట్లు సమాచారం. సల్మాన్, అతడి సోదరులంతా కలిసి తెలంగాణలోని హీరోయిన్ ఇంటికి రావడం.. ఇక్కడి సంప్రదాయాల్లో కలిసి పోయే ప్రయత్నం చేయడం.. ఆ తర్వాత హీరోయిన్ సోదరుడిని ఇంప్రెస్ చేయడం.. ఈ నేపథ్యంలో కథ సాగుతుందట. ఆ నేపథ్యంలోనే బతుకమ్మ పాటతో పాటు వెంకీ, చరణ్ కలిసి సందడి చేసే సాంగ్ కూడా వస్తుందట. రంజాన్ కానుకగా ఈ నెల 21నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on April 8, 2023 7:00 pm
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…
అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…
నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…