Movie News

అంజి రేంజులో మెగా ఫాంటసీ మూవీ

గత ఏడాది కళ్యాణ్ రామ్ కు బింబిసార రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు వశిష్ట మల్లిడి కొత్త సినిమా ఏదో ఇప్పటిదాకా సస్పెన్స్ గానే ఉంటూ వచ్చింది. దానికి సీక్వెల్ చేస్తారనే వార్తలు బలంగా వచ్చాయి. హీరో సైతం పలు సందర్భాల్లో ఆ ప్లాన్ ఉందని నొక్కి చెప్పాడు. అయితే కొనసాగింపుకు సంబంధించి ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రస్తుతానికది పెండింగ్ లో పెట్టారని టాక్. బింబిసారని ప్రత్యేకంగా చూసిన బాలకృష్ణ త్వరలోనే అవకాశమిస్తానని వశిష్టతో చెప్పడం అభిమానులకు గుర్తే. అయితే బాలయ్య కమిట్ మెంట్ల వల్ల అంత త్వరగా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

ఊహించని రీతిలో ఇప్పుడీ యువ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసి ఛాన్స్ కొట్టేశాడని లేటెస్ట్ లీక్. ప్రస్తుతం భోళా శంకర్ షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు గతంలో ఓకే చేసిన వెంకీ కుడుముల ప్రాజెక్టుని డ్రాప్ అయ్యారు. దీంతో అతను నితిన్ రష్మిక మందన్నలతో సెట్ చేసుకున్నాడు. వివి వినాయక్ పేరు వినిపిస్తున్నప్పటికీ స్టోరీ సెట్ కాకపోవడంతో అదీ పెండింగ్ లోనే ఉందట. ఇప్పుడు వశిష్ట చెప్పిన లైన్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. అధికారికంగా ప్రకటించలేదు కానీ అంతర్గతంగా ఓకే అయినట్టు విశ్వసనీయ వార్త.

అభిమానులు కోరుకుంటున్నది ఇలాంటి కాంబినేషన్లే. మెహర్ రమేష్, మోహన్ రాజా లాంటి నిన్నటి తరం దర్శకుల కన్నా రజనీకాంత్ టైపులో న్యూ జనరేషన్ డైరెక్టర్లతో కట్టు కట్టాలని. బాలకృష్ణ అందుకే గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిలతో లైనప్ చేసుకున్నారు. ఇక చిరు వశిష్టల కాంబోలో రూపొందబోయే చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇది కూడా బింబిసార తరహాలో ఫాంటసీ టచ్ తో ఉంటుందట. ఎలాగూ చిరంజీవి అంటే బడ్జెట్ పరంగా ఎలాంటి పరిమితులు ఉండవు కాబట్టి అంజి తరువాత ఆ రేంజ్ గ్రాండియార్ చూడొచ్చేమో.

Satya

Recent Posts

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

16 minutes ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

43 minutes ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

46 minutes ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

1 hour ago

మళ్ళీ మౌనవ్రతం చేస్తున్న స్లమ్ డాగ్

పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…

3 hours ago

సుకుమార్ వేసిన దారిలో ఎందరో

ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…

12 hours ago