సెకండ్ హాఫ్ కి పిచ్చెక్కిపోతారు, సీట్ల అంచున కూర్చుంటారని విశ్వక్ సేన్ తెగ ఊరించి ప్రమోట్ చేసుకున్న దాస్ కా ధమ్కీ థియేట్రికల్ రన్ ముగిసింది. ఏప్రిల్ 14న ఆహా యాప్ లో ప్రీమియర్ మొదలు కానుంది. అంటే మూడు వారాలు తిరగడం ఆలస్యం స్మార్ట్ దారి పట్టేసింది. బిజినెస్ పరంగా బ్రేక్ ఈవెన్ అయ్యిందో లేదో స్పష్టమైన సమాచారం లేదు కానీ సినిమా ఫెయిలైన మాట వాస్తవం. ఏదైతే విశ్వక్ హైలైట్ గా చెప్పుకున్నాడో అదే పెద్ద మైనస్ గా మారడంతో పాటు ఈసారి మాటల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ జనంలో వర్కౌట్ కాలేదు. పాగల్ స్ట్రాటజీ పని చేయలేదు.
తనకు పెద్ద బ్రేక్ ఇస్తుందని విశ్వక్ సేన్ దీని మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. స్టార్ రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ కు భారీ పారితోషికం ఇచ్చి మరీ కథను కొన్నాడు. నరేష్ కుప్పిలిని తొలుత దర్శకుడిగా తీసుకుని తర్వాత ఏదో కారణంతో తనే మెగా ఫోన్ పట్టాడు. ఎన్ని ట్విస్టులు ఎక్కువ ఉంటే అంత బాగా ఆడియన్స్ థ్రిల్ అవుతారనే అంచనా పూర్తిగా తప్పింది. పాటలు పెద్దగా ఎక్కలేదు. డ్యూయల్ రోల్ చేసిన కష్టమూ ఫలించలేదు. ధమ్కీ 2 తీయాలని ముందే ప్లాన్ చేసుకున్న ఈ కుర్ర హీరో ఇప్పుడది దాదాపు డ్రాప్ అయినట్టేనని ఇన్ సైడ్ టాక్.
ఫైనల్ గా టాలీవుడ్ నిర్మాతలు థియేటర్ కు ఓటిటికి మధ్య గ్యాప్ విషయంలో ఎవరూ ఎలాంటి నిబంధనలు పాటించడం లేదని అర్థమైపోయింది. బలగం లాంటి బ్లాక్ బస్టరే మూడు వారాలకు వచ్చినప్పుడు ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది. దాస్ కా ధమ్కీ రిలీజ్ కు ముందు ప్రముఖ ఓటిటి సంస్థ మంచి ఆఫర్ ఇచ్చినా విడుదలయ్యాక ఇంకా పెద్ద రేట్ వస్తుందనే నమ్మకంతో దాన్ని తిరస్కరించిన విశ్వక్ ఇప్పుడు రాజీపడి కొన్ని కోట్లు వదుకోవాల్సి వచ్చిందని టాక్. మొత్తానికి దూకుడు కన్నా నెమ్మదితనమే కరెక్టని ఇప్పటికైనా దాస్ కి అర్థమయ్యిందో లేదో.
This post was last modified on April 6, 2023 6:45 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…