సెకండ్ హాఫ్ కి పిచ్చెక్కిపోతారు, సీట్ల అంచున కూర్చుంటారని విశ్వక్ సేన్ తెగ ఊరించి ప్రమోట్ చేసుకున్న దాస్ కా ధమ్కీ థియేట్రికల్ రన్ ముగిసింది. ఏప్రిల్ 14న ఆహా యాప్ లో ప్రీమియర్ మొదలు కానుంది. అంటే మూడు వారాలు తిరగడం ఆలస్యం స్మార్ట్ దారి పట్టేసింది. బిజినెస్ పరంగా బ్రేక్ ఈవెన్ అయ్యిందో లేదో స్పష్టమైన సమాచారం లేదు కానీ సినిమా ఫెయిలైన మాట వాస్తవం. ఏదైతే విశ్వక్ హైలైట్ గా చెప్పుకున్నాడో అదే పెద్ద మైనస్ గా మారడంతో పాటు ఈసారి మాటల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ జనంలో వర్కౌట్ కాలేదు. పాగల్ స్ట్రాటజీ పని చేయలేదు.
తనకు పెద్ద బ్రేక్ ఇస్తుందని విశ్వక్ సేన్ దీని మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. స్టార్ రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ కు భారీ పారితోషికం ఇచ్చి మరీ కథను కొన్నాడు. నరేష్ కుప్పిలిని తొలుత దర్శకుడిగా తీసుకుని తర్వాత ఏదో కారణంతో తనే మెగా ఫోన్ పట్టాడు. ఎన్ని ట్విస్టులు ఎక్కువ ఉంటే అంత బాగా ఆడియన్స్ థ్రిల్ అవుతారనే అంచనా పూర్తిగా తప్పింది. పాటలు పెద్దగా ఎక్కలేదు. డ్యూయల్ రోల్ చేసిన కష్టమూ ఫలించలేదు. ధమ్కీ 2 తీయాలని ముందే ప్లాన్ చేసుకున్న ఈ కుర్ర హీరో ఇప్పుడది దాదాపు డ్రాప్ అయినట్టేనని ఇన్ సైడ్ టాక్.
ఫైనల్ గా టాలీవుడ్ నిర్మాతలు థియేటర్ కు ఓటిటికి మధ్య గ్యాప్ విషయంలో ఎవరూ ఎలాంటి నిబంధనలు పాటించడం లేదని అర్థమైపోయింది. బలగం లాంటి బ్లాక్ బస్టరే మూడు వారాలకు వచ్చినప్పుడు ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది. దాస్ కా ధమ్కీ రిలీజ్ కు ముందు ప్రముఖ ఓటిటి సంస్థ మంచి ఆఫర్ ఇచ్చినా విడుదలయ్యాక ఇంకా పెద్ద రేట్ వస్తుందనే నమ్మకంతో దాన్ని తిరస్కరించిన విశ్వక్ ఇప్పుడు రాజీపడి కొన్ని కోట్లు వదుకోవాల్సి వచ్చిందని టాక్. మొత్తానికి దూకుడు కన్నా నెమ్మదితనమే కరెక్టని ఇప్పటికైనా దాస్ కి అర్థమయ్యిందో లేదో.
This post was last modified on April 6, 2023 6:45 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…