జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో వార్ 2 వస్తుందన్న వార్త మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియా హల్చల్ మాములుగా లేదు. అసలు ఊహించని కాంబినేషన్ తెరపైకి రావడం నిజానికి టాలీవుడ్ పెద్దలు సైతం ముందే కనిపెట్టలేకపోయారు. ఒక్కసారిగా లావా బద్దలైనట్టు ఈ న్యూస్ ప్రచారంలోకి రావడంతో ముంబై మీడియా విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చేసింది. హృతిక్ తారక్ కలిసి డాన్సులు ఫైట్లు చేయడం చూస్తే థియేటర్లలో కుదురుగా కూర్చోవడం కష్టమేనని ఆల్రెడీ ట్వీట్లు మొదలైపోయాయి. ఇంతకీ వార్ 2కి తారక్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత?
ప్రస్తుతం జూనియర్ కు కేవలం పారితోషికమే వంద కోట్లు చెల్లించే రేంజ్ కు వెళ్ళింది. దక్షిణాది పరిశ్రమలో అతి పెద్ద మొత్తం అందుకుంటున్న టాప్ 5 స్టార్స్ లో చేరిపోయాడు. ఇప్పుడు వార్ 2 కోసం ముప్పై కోట్లు ఆఫర్ చేశారని వినికిడి. అయితే ఇది ప్రత్యేక పాత్ర కోసమా లేక ఫుల్ ప్యాకేజ్ వంద కోట్లు ఇచ్చి పూర్తి స్థాయి పాత్ర చేయిస్తారా అనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో క్యామియోల రూపంలో యష్ రాజ్ స్పైవర్స్ హీరోలందరూ కనిపిస్తారని ఇప్పటికే పలు ఛానల్స్ లో హోరెత్తిపోతోంది.
ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు వార్ 2 కనక బ్లాక్ బస్టర్ అయితే స్టార్ డం నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. ప్రస్తుతం కొరటాల శివ ప్రాజెక్టు మీదే పూర్తిగా ఫోకస్ పెట్టిన తారక్ ఎప్పుడో కమిటైన ప్రశాంత్ నీల్ సినిమా కన్నా ముందే వార్ 2 పూర్తి చేసే అవకాశాలున్నాయి. కాకపోతే పాత్ర పరిధి, ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తొలి బాలీవుడ్ స్ట్రెయిట్ డెబ్యూ కావడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ మంచి ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. అందులోనూ క్రేజీ మూవీ కాబట్టి పఠాన్ కు రెట్టింపు స్థాయిలో వసూళ్లు నమోదు కావడం ఖాయం.
This post was last modified on April 6, 2023 5:04 pm
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…