శాండల్ వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ మనకూ సుపరిచితుడే. రాజమౌళి ఈగలో విలన్ గా నటించాక తెలుగు అభిమానులకు దగ్గరయ్యాడు. సైరా నరసింహారెడ్డిలో అరకురాజుగా కనిపించిన ఈ విలక్షణ నటుడు గత ఏడాది విక్రాంత్ రోణాతో డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు. యాభై దాటిన వయసులోనూ మంచి బాడీ ఫిట్ నెస్ మైంటైన్ చేసే ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఇటీవలే కబ్జలో క్యామియో చేసి డిజాస్టర్ అందుకున్న సుదీప్ చుట్టూ ఇప్పుడు రాజకీయ వలలు కమ్ముకుంటున్నాయి. కారణం రాబోయే ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇస్తానని బహిరంగంగా ప్రకటించడమే.
ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్లు ఈ వార్త చూసి షాక్ తిన్నామని ట్వీట్లు పెట్టడం, కాషాయ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఈ చర్యకు స్పందనగా సుదీప్ రాబోయే సినిమాలను థియేటర్ల దగ్గర అడ్డుకుంటామని ప్రతినలు చేయడం ఇలా రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిజానికి సుదీప్ కొంతకాలంగా వివాదాలను కోరి తెచ్చుకుంటున్నాడు. గత ఏడాది బాలీవుడ్ హీరోలు, హిందీ భాష మీద చేసిన కామెంట్స్ పెద్ద డిబేట్ కి దారి తీశాయి. ఓపెన్ గా మాట్లాడినట్టు ఉన్నా సుదీప్ వ్యాఖ్యలు ఇలా పక్కదారి పట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఫైనల్ గా సుదీప్ నేరుగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకపోయినా ప్రచారం చేస్తానని చెప్పడం ద్వారా ఇన్ డైరెక్ట్ గా దిగిపోయినట్టే. వాస్తవానికి ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే టాక్ వచ్చినప్పటికీ ఏదో తీవ్రమైన ఒత్తిడి వల్ల ఆ నిర్ణయం మార్చుకున్నట్టు బెంగళూర్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాజకీయాల్లోకి రావడం హీరోలకు కొత్తేమీ కాదు కానీ కర్ణాటకలో వీళ్ళు అధికారిన్ని శాసించిన దాఖలాలు అంతగా కనిపించవు. లెజెండరీ నటులు డాక్టర్ రాజ్ కుమార్ సైతం వీటికి దూరంగా ఉంటూ వచ్చారు. మరి సుదీప్ సపోర్ట్ ఈసారి ఏం చేస్తుందో చూడాలి.
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…
90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…
ముందు సౌత్ సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్లో స్థిరపడ్డ హీరోయిన్లు చాలామంది.. ఇక్కడి సినిమాలు, పరిస్థితుల గురించి విమర్శలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్కు ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’…
పదేళ్లకు పైగా 33 మంది పసి బాలురపై పునరావృత లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ బందా ప్రత్యేక పోక్సో…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటిస్తే.. అది అమలు కావాల్సిందే!. అది గిరిజన ప్రాంతమైనా.. మైదాన ప్రాంతమైనా.. చెప్పినట్టు…