న్యాచురల్ స్టార్ నాని దసరా రెండో వారంలోకి అడుగు పెట్టడం ఆలస్యం వంద కోట్ల గ్రాస్ ని అందుకుంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలని నమ్మినందుకు దానికి మించిన గొప్ప ఫలితం దక్కడం పట్ల ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. డెబ్యూ డైరెక్టర్ ఈ ఫీట్ సాధించడం కొత్త కాదు. ఉప్పెనతో బుచ్చిబాబు ఆల్రెడీ ఆ మార్కు అందుకున్నాడు. అది కూడా వైష్ణవ్ తేజ్ లాంటి కొత్త హీరోతో. అయినా కూడా దసరా వంద కోట్లకు చాలా ప్రత్యేకత ఉంది. ఒక్క నాని తప్ప ఈ సినిమాకు మార్కెటింగ్ పరంగా ఎలాంటి ఆకర్షణ లేదు. కీర్తి సురేష్ కొంతమేర తోడైనా మరీ ఎక్కువ కాదు.
కథను మలుపు తిప్పే సూరిగా దీక్షిత్ శెట్టి, విలన్ చిన్ననంబిగా చేసిన షైన్ టామ్ చాకో ఇద్దరూ కొత్తవారే. కానీ ఉప్పెనలో విజయ్ సేతుపతి లాంటి పవర్ ఫుల్ ప్రతినాయకుడు చాలా ప్లస్ అయ్యాడు. దానికి దేవిశ్రీ ప్రసాద్ రేంజ్ లో అన్ని పాటలు దసరాకు సంతోష్ నారాయణన్ ఇవ్వలేకపోయారు. దోస్తాన్, వదినే రెండు మాత్రమే ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. దసరా నిర్మాత వరస ఫ్లాపుల్లో ఉన్నారు. దీంతో అవుట్ రైట్ గా నైజాం ఏరియా హక్కులను దిల్ రాజుకు అమ్మేశారు. కట్ చేస్తే ఇప్పడొచ్చిన లాభాలతో సుధాకర్ చెరుకూరి ఏకంగా కోటి రూపాయల కారుని శ్రీకాంత్ కి గిఫ్ట్ గా ఇచ్చారు.
ఉప్పెన లాగా యూత్ ని ఆకట్టుకునే అంశాలు దసరాలో తక్కువ. హింస మోతాదు డామినేట్ చేసింది. అయినా కూడా టేకింగ్ లో నిజాయితీ, నాని వన్ మ్యాన్ షో అన్ని వర్గాలను అంగీకరించేలా చేసింది. ఇప్పటికి పూర్తయ్యింది మొదటివారమే కాబట్టి రేపు రిలీజ్ కాబోతున్న రావణాసుర, మీటర్ లకొచ్చే టాక్ ని బట్టి దసరా పికప్ ఏ స్థాయిలో ఉంటుందనేది అంచనా వేయొచ్చు. మాస్ హీరోగా నానికి యునివర్సల్ యాక్సెప్ టెన్స్ దొరికేసింది. ఈ తరహా సబ్జెక్టులతో మెప్పించవచ్చని శ్రీకాంత్ ఓదెల నిరూపించాడు. అందుకే దసరా 100 కోట్లు స్పెషల్ గా నిలిచిపోతుంది
This post was last modified on April 6, 2023 2:12 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…