మొత్తానికి ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఖరారైంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. అగ్ర దర్శకుడు కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్ ఓకే అయిందని.. సినిమా ప్రకటించబోతున్నారని కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. ‘స్టైల్ ప్లస్ సబ్స్టెన్స్’ అంటూ ముందే సంకేతాలు ఇచ్చి శుక్రవారం ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. పోస్టర్ మీద అల్లు అర్జున్, కొరటాల శివ కాకుండా కనిపించిన మిగతా పేర్లన్నీ కొత్తవే కావడం విశేషమే. ఈ చిత్రంతో బన్నీ తన చిన్ననాటి స్నేహితులను నిర్మాతలుగా పరిచయం చేయబోతున్నాడని ముందే వెల్లడైంది. ఆ ముగ్గురి పేర్లు.. శాండీ, స్వాతి, నట్టీ. ఈ ముగ్గురి గురించి బన్నీ తన ట్వీట్లో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మీపై నా ప్రేమను ఇలా చూపిస్తున్నా అని పేర్కొన్నాడు.
ఐతే ఈ సినిమా పోస్టర్ మీద మరో కొత్త పేరు కూడా కనిపించింది. అదే.. సుధాకర్ మిక్కిలినేని. ఈ చిత్రంలో మేజర్ పార్టనర్ ఈయనే. కొరటాల శివకు అత్యంత సన్నిహితుడు ఈ సుధాకర్. ఇతణ్ని నిర్మాతను చేయాలని కొరటాల ఎప్పుడో ఫిక్సయ్యాడు. ‘జనతా గ్యారేజ్’ చేస్తున్న సమయంలోనే సుధాకర్.. కొరటాలకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతై ప్రొడక్షన్ నంబర్ వన్ అంటూ సినిమాను ప్రకటించాడు. ఐతే కొరటాలకు ఉన్న వేరే కమిట్మెంట్ల వల్ల అతడితో సినిమా చేయడం ఆలస్యమైంది. ఎట్టకేలకు బన్నీ సినిమాను అతడికి కేటాయించాడు. ప్రస్తుతం హీరోగా అల్లు అర్జున్, దర్శకుడిగా కొరటాల శివల స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పుష్ష, ఆచార్య చిత్రాల తర్వాత వీళ్ల రేంజ్ ఇంకా పెరగొచ్చు. వీరి కాంబినేషన్ పట్టాలెక్కే సమయానికి బిజినెస్ రేంజ్ రూ.150 కోట్లకు చేరొచ్చు. అంత పెద్ద ప్రాజెక్టును ఈ హీరో, దర్శకుడు తమ మిత్రులకు కేటాయించడం విశేషమే.
This post was last modified on July 31, 2020 10:22 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…