రవితేజ , సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రావణాసుర’ ఈ నెల 7న థియేటర్స్ లో వస్తుంది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి టీం ఎలాంటి హింట్ ఇవ్వకుండా కంటెంట్ గురించి ఏమి చెప్పకుండా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇటీవలే ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ మీడియా ముందుకొచ్చారు. కేరెక్టర్స్ గురించి అడిగినా , సినిమా గురించి అడిగినా వాళ్ళ నుండి వచ్చిన సమాధానం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఇక దర్శకుడు సుధీర్ వర్మ కూడా ఈ సినిమా ఎలా ఉంటుంది ? ఎలాంటి ట్విస్టులు ఉంటాయనేది చెప్పకుండా అన్నీ థియేటర్స్ లోనే అంటున్నాడు. అదీ కాక ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేయకపోవడానికి కంటెంట్ అక్కడ ముందే రివీల్ అవుతుందని చెప్పడం మీడియాకి కూడా ఆశ్చర్యం కలిగించింది. అంత గోప్యంగా ఉంచడానికి టీం ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ప్రశ్నలు మీడియాలో మొదలయ్యాయి.
అయితే థ్రిల్లర్ సినిమా గురించి రిలీజ్ కి ముందు పెద్దగా ట్విస్టులు చెప్పలేరు. కానీ కంటెంట్ ఇలా ఉంటుంది. పాత్రలు ఇలా ఉంటాయని చెప్పకుండా అన్నీ థియేటర్స్ లోనే అంటూ అక్కడ ప్రేక్షకులకు సర్ప్రయిజ్ ఉంటుందని చెప్తే ఎలా ? రావణాసుర టీం చేస్తున్న ఈ గప్చుప్ ప్రమోషన్ బుకింగ్స్ పై ఎఫెక్ట్ పడేలా ఉంది మరి.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…