రవితేజ , సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రావణాసుర’ ఈ నెల 7న థియేటర్స్ లో వస్తుంది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి టీం ఎలాంటి హింట్ ఇవ్వకుండా కంటెంట్ గురించి ఏమి చెప్పకుండా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇటీవలే ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ మీడియా ముందుకొచ్చారు. కేరెక్టర్స్ గురించి అడిగినా , సినిమా గురించి అడిగినా వాళ్ళ నుండి వచ్చిన సమాధానం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఇక దర్శకుడు సుధీర్ వర్మ కూడా ఈ సినిమా ఎలా ఉంటుంది ? ఎలాంటి ట్విస్టులు ఉంటాయనేది చెప్పకుండా అన్నీ థియేటర్స్ లోనే అంటున్నాడు. అదీ కాక ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేయకపోవడానికి కంటెంట్ అక్కడ ముందే రివీల్ అవుతుందని చెప్పడం మీడియాకి కూడా ఆశ్చర్యం కలిగించింది. అంత గోప్యంగా ఉంచడానికి టీం ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ప్రశ్నలు మీడియాలో మొదలయ్యాయి.
అయితే థ్రిల్లర్ సినిమా గురించి రిలీజ్ కి ముందు పెద్దగా ట్విస్టులు చెప్పలేరు. కానీ కంటెంట్ ఇలా ఉంటుంది. పాత్రలు ఇలా ఉంటాయని చెప్పకుండా అన్నీ థియేటర్స్ లోనే అంటూ అక్కడ ప్రేక్షకులకు సర్ప్రయిజ్ ఉంటుందని చెప్తే ఎలా ? రావణాసుర టీం చేస్తున్న ఈ గప్చుప్ ప్రమోషన్ బుకింగ్స్ పై ఎఫెక్ట్ పడేలా ఉంది మరి.
This post was last modified on April 5, 2023 10:09 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…