రవితేజ , సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రావణాసుర’ ఈ నెల 7న థియేటర్స్ లో వస్తుంది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి టీం ఎలాంటి హింట్ ఇవ్వకుండా కంటెంట్ గురించి ఏమి చెప్పకుండా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇటీవలే ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ మీడియా ముందుకొచ్చారు. కేరెక్టర్స్ గురించి అడిగినా , సినిమా గురించి అడిగినా వాళ్ళ నుండి వచ్చిన సమాధానం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఇక దర్శకుడు సుధీర్ వర్మ కూడా ఈ సినిమా ఎలా ఉంటుంది ? ఎలాంటి ట్విస్టులు ఉంటాయనేది చెప్పకుండా అన్నీ థియేటర్స్ లోనే అంటున్నాడు. అదీ కాక ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేయకపోవడానికి కంటెంట్ అక్కడ ముందే రివీల్ అవుతుందని చెప్పడం మీడియాకి కూడా ఆశ్చర్యం కలిగించింది. అంత గోప్యంగా ఉంచడానికి టీం ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ప్రశ్నలు మీడియాలో మొదలయ్యాయి.
అయితే థ్రిల్లర్ సినిమా గురించి రిలీజ్ కి ముందు పెద్దగా ట్విస్టులు చెప్పలేరు. కానీ కంటెంట్ ఇలా ఉంటుంది. పాత్రలు ఇలా ఉంటాయని చెప్పకుండా అన్నీ థియేటర్స్ లోనే అంటూ అక్కడ ప్రేక్షకులకు సర్ప్రయిజ్ ఉంటుందని చెప్తే ఎలా ? రావణాసుర టీం చేస్తున్న ఈ గప్చుప్ ప్రమోషన్ బుకింగ్స్ పై ఎఫెక్ట్ పడేలా ఉంది మరి.
This post was last modified on April 5, 2023 10:09 pm
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…