పదేళ్లకు పైగా బ్రేక్ కోసం ఎదురు చూసిన సిద్దు జొన్నలగడ్డకు ఏకంగా బ్లాక్ బస్టర్ అందించిన డీజే టిల్లు మీద యూత్ లో ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనక్కర్లేదు. పెద్దగా బడ్జెట్ పెట్టకుండా సింపుల్ క్రైమ్ ఎలిమెంట్ తో సిద్దు బాడీ లాంగ్వేజ్ ని ఉపయోగించుకుని దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన తీరు భారీ వసూళ్లను కురిపించింది. ప్రస్తుతం దీని సీక్వెల్ టైటిల్ కు స్క్వేర్ జోడించుకుని షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం చిత్రీకరణ మంచి స్వింగ్ లో ఉంది. పలువురు హీరోయిన్లు మారాక ఫైనల్ గా అనుపమ పరమేశ్వరన్ తో లాక్ చేసుకోవడం తెలిసిందే.
దీని రిలీజ్ డేట్ విషయంలో నిర్మాత నాగవంశీ ప్రాధమికంగా ఆగస్ట్ 11గా నిర్ణయం తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. నిజానికిది మహేష్ బాబు 28 కోసం లాక్ చేసుకున్నది. కానీ ఆ టైంకంతా పూర్తి చేయడం అసాధ్యమని తేలిపోవడంతో సంక్రాంతికి వాయిదా వేశారు. అందుకే దాని స్థానంలో టిల్లు స్క్వేర్ ని దింపాలని చూస్తున్నారట. అయితే అదే రోజు చిరంజీవి భోళా శంకర్ ఆల్రెడీ కర్చీఫ్ వేసుకుని ఉంది. ఇది కాకుండా రన్బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగా యానిమల్, సన్నీ డియోల్ గదర్ 2 ఉన్నాయి. రజనీకాంత్ జైలర్ సైతం ఇండిపెండెన్స్ డేని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంత పెద్ద వలయం పెట్టుకుని టిల్లు స్క్వేర్ దిగితే రిస్క్ అవుతుంది. గతంలో ఇదే నిర్మాత ఇదే సంస్థ బెల్లంకొండ గణేష్ డెబ్యూ మూవీ స్వాతిముత్యంని దసరా పండగ వాడుకునే ఉద్దేశంతో గాడ్ ఫాదర్, ఘోస్ట్ ల మధ్యలో నిలిపారు. ఫలితంగా కంటెంట్ బాగున్నా సినిమా ఆడలేదు. ఇప్పుడు టిల్లు 2కి ఎంత క్రేజ్ ఉన్నా ఈ స్థాయి పోటీని పెట్టుకుని రావడం సాహసమే అవుతుంది. ఒకవేళ ఇది మిస్ చేసుకున్నా తిరిగి దసరాకి ఇంతకన్నా ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఏదో ఒకటి ఫేస్ చేయక తప్పదు. ఈ రెండో భాగానికి డైరెక్టర్ మారి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…