ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ రేసు గుర్రంలో విలన్ గా నటించాకే రవికిషన్ కు టాలీవుడ్ లో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే చేశారు. అయితే అధికశాతం జనాలకు తెలియని విషయం ఏంటంటే ఇతగాడు భోజ్ పూరి భాషలో స్టార్ హీరో. మంచి హిట్లున్నాయి. అయితే మార్కెట్లు రెమ్యునరేషన్లు గట్రా బాగా తక్కువ. అందుకే వేరే లాంగ్వేజెస్ లోనూ ప్రూవ్ చేసుకుని ఆదాయం పెంచుకునే ఉద్దేశంతో తెలుగు తమిళంలో విస్తృతంగా నటించాడు.ఇతనికి నగ్మాకి ఏదో సంథింగ్ ఉందనే గాసిప్ నార్త్ మీడియాలో గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది.
నగ్మా ఎవరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 90 దశకంలో ఘరానా మొగుడు, కిల్లర్, పెద్దింటల్లుడు, వారసుడు, మేజర్ చంద్రకాంత్ లాంటి సూపర్ హిట్స్ తో ఓ రేంజ్ మార్కెట్ ని ఎంజాయ్ చేసింది. కాకపోతే త్వరగా కనుమరుగయ్యింది. అక్కడితో కెరీర్ అయిపోలేదు. భోజ్ పూరిలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక రవికిషన్ కాంబోలో సక్సెస్ ఫుల్ మూవీస్ వచ్చాయి. ఆ సమయంలోనే వీళ్లిద్దరి బంధం గురించి వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించి ప్రముఖ టీవీ సెలబ్రిటీ షో ఆప్ కి అదాలత్ లో రవికిషన్ నేరుగా స్పందించి కుండబద్దలు కొట్టే ప్రయత్నం చేశాడు
తాను నగ్మా మంచి స్నేహితులమే తప్ప ఇంకేదీ లేదని, భార్య ప్రీతీ శుక్లాను ఎంతగానో గౌరవించి ప్రేమించే తనకు ఎలాంటి దురుదేశాలు లేవని, ఈ విషయాన్నీ చాలాసార్లు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేశారు. అంతేకాదు ఆమె పాదాలకు నమస్కరించిన ఉదంతాన్ని కూడా చెప్పారు. ఒకప్పుడు పొగరుతో ఉన్న తనను బిగ్ బాస్ హౌస్ కి పంపించి మూడు నెలల తర్వాత మారిన మనిషిలా వచ్చేలా చేసిన ఘనత శ్రీమతికే దక్కుతుందని కితాబు ఇచ్చాడు. నగ్మాతో రిలేషన్ గురించి కన్నా భార్య గురించే ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చిన రవికిషన్ లో మంచి భర్త ఉన్నాడన్న మాట.
This post was last modified on April 4, 2023 10:50 am
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…