ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ రేసు గుర్రంలో విలన్ గా నటించాకే రవికిషన్ కు టాలీవుడ్ లో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే చేశారు. అయితే అధికశాతం జనాలకు తెలియని విషయం ఏంటంటే ఇతగాడు భోజ్ పూరి భాషలో స్టార్ హీరో. మంచి హిట్లున్నాయి. అయితే మార్కెట్లు రెమ్యునరేషన్లు గట్రా బాగా తక్కువ. అందుకే వేరే లాంగ్వేజెస్ లోనూ ప్రూవ్ చేసుకుని ఆదాయం పెంచుకునే ఉద్దేశంతో తెలుగు తమిళంలో విస్తృతంగా నటించాడు.ఇతనికి నగ్మాకి ఏదో సంథింగ్ ఉందనే గాసిప్ నార్త్ మీడియాలో గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది.
నగ్మా ఎవరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 90 దశకంలో ఘరానా మొగుడు, కిల్లర్, పెద్దింటల్లుడు, వారసుడు, మేజర్ చంద్రకాంత్ లాంటి సూపర్ హిట్స్ తో ఓ రేంజ్ మార్కెట్ ని ఎంజాయ్ చేసింది. కాకపోతే త్వరగా కనుమరుగయ్యింది. అక్కడితో కెరీర్ అయిపోలేదు. భోజ్ పూరిలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక రవికిషన్ కాంబోలో సక్సెస్ ఫుల్ మూవీస్ వచ్చాయి. ఆ సమయంలోనే వీళ్లిద్దరి బంధం గురించి వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించి ప్రముఖ టీవీ సెలబ్రిటీ షో ఆప్ కి అదాలత్ లో రవికిషన్ నేరుగా స్పందించి కుండబద్దలు కొట్టే ప్రయత్నం చేశాడు
తాను నగ్మా మంచి స్నేహితులమే తప్ప ఇంకేదీ లేదని, భార్య ప్రీతీ శుక్లాను ఎంతగానో గౌరవించి ప్రేమించే తనకు ఎలాంటి దురుదేశాలు లేవని, ఈ విషయాన్నీ చాలాసార్లు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేశారు. అంతేకాదు ఆమె పాదాలకు నమస్కరించిన ఉదంతాన్ని కూడా చెప్పారు. ఒకప్పుడు పొగరుతో ఉన్న తనను బిగ్ బాస్ హౌస్ కి పంపించి మూడు నెలల తర్వాత మారిన మనిషిలా వచ్చేలా చేసిన ఘనత శ్రీమతికే దక్కుతుందని కితాబు ఇచ్చాడు. నగ్మాతో రిలేషన్ గురించి కన్నా భార్య గురించే ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చిన రవికిషన్ లో మంచి భర్త ఉన్నాడన్న మాట.
This post was last modified on April 4, 2023 10:50 am
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…