ఒకేసారి మూడు ప్యాన్ ఇండియా సినిమాలను సెట్ల మీద ఉంచి క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్ ని ఎప్పుడెప్పుడా చూద్దామాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆది పురుష్ మీద అంచనాల సంగతేమో కానీ వాళ్ళ గురి సలార్ మీదే ఎక్కువుందన్నది వాస్తవం. ఆ తర్వాత జనవరిలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రాజెక్ట్ కె ఖచ్చితంగా వస్తుందా రాదానే దాని మీద అనుమానాలు తొలగిపోలేదు. ఒకవేళ ఇది మిస్ అయితే మాత్రం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ ఆ స్థానం తీసుకోవడం దాదాపు ఖాయమే. గత నాలుగైదు నెలలుగా దీని షూట్ వేగంగా జరుగుతోంది.
ఇందులో ఒకప్పటి క్రియేటివ్ జీనియస్ రామ్ గోపాల్ వర్మ ఒక చిన్న క్యామియో చేశారనే వార్త గట్టిగానే తిరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన ఒక టెర్రస్ సెట్ లో కీలక ఆర్టిస్టులతో పాటు వర్మ పాల్గొన్న ఒక ఎపిసోడ్ ని మారుతీ ఆల్రెడీ తీశారట. కాకపోతే ఆ సన్నివేశాలు అనుకున్నంత స్థాయిలో రాకపోవడంతో వాటిని ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఉంచాలో లేదో పోస్ట్ ప్రొడక్షన్ టైంలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. అయినా అదే పనిగా వర్మతో చేయించేంత క్యారెక్టర్ మారుతీ ఏం డిజైన్ చేసుంటాడనే డౌట్ అభిమానుల్లో కలుగుతోంది.
ఒకప్పుడు కల్ట్ డైరెక్టర్ గా వర్మకు ఎంత పేరున్నా గత కొన్నేళ్లుగా ఆయన చర్యలు, తీసిన సినిమాలు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ట్వీట్ల కారణంగా విపరీతమైన నెగటివిటీని మూటగట్టుకున్నారు. హీరో ఎవరైనా సరే ఈయన ఫలానా చిత్రంలో ఉన్నారంటే అమాంతం దానికొచ్చే క్రేజ్ ఏమీ ఉండదు.అలాంటప్పుడు ఏదో ఎక్స్ ట్రాడినరీగా చేశారంటే తప్ప ఏదో ఆషామాషీ సీన్ల వల్ల ఒరిగే ప్రయోజనం శూన్యం. అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఇదంతా ప్రస్తుతానికి పుకారుగానే చక్కర్లు కొడుతోంది. రాజా డీలక్స్ అనే టైటిల్ దీనికి పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 3, 2023 3:29 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…